కరోనా కారణంగా గత అయిదు ఆరు నెలలుగా షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి.సీరియల్స్ వెబ్ సిరీస్ల చిత్రీకరణ కొనసాగుతున్నా పెద్ద హీరోల సినిమాలు మాత్రం ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు.
ఇన్నాళ్లు భయం గుప్పిట్లో ఉన్న స్టార్స్ మెల్లగా బయటకు అడుగులు వేస్తున్నారు.సెప్టెంబర్ మరియు అక్టోబర్ నుండి షూటింగ్ ను నిర్వహించాలనే నిర్ణయానికి స్టార్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఒక్కరు ఇద్దరు తప్ప అందరు కూడా అక్టోబర్ వరకు సెట్స్ పైకి రాబోతున్నారు.ఈ సమయంలో బాలీవుడ్ స్టార్స్ పలువురు సినిమాలు షురూ చేశారు.
టాలీవుడ్ స్టార్స్ కూడా ధైర్యంగా ముందు అడుగు వేసేందుకు రెడీ అవుతున్నారు.ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది.కరోనా పేరుతో సినిమాలన్నీ ఆగిపోయాయి.నిర్మాతలకు వందల కోట్ల నష్టం.
అందుకే మరింత ఆలస్యం చేయడం ఏమాత్రం సబబు కాదనే ఉద్దేశ్యంతో హీరోలు నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలతో షూటింగ్కు జాయిన్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.బాలకృష్ణ.
చిరంజీవి.వెంకటేష్ వంటి స్టార్స్ కూడా షూటింగ్లో జాయిన్ అవ్వబోతున్నారు.
మహేష్బాబు సినిమాను అక్టోబర్ చివరి నుండి పట్టాలెక్కించే అవకాశం కనిపిస్తుంది.ఇక రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ సినిమాను అక్టోబర్ లేదా నవంబర్ నుండి ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు.
ఇలా మొత్తానికి యంగ్ స్టార్ హీరోలు సూపర్ స్టార్ లు సీనియర్ స్టార్లు అంతా కూడా ఈ ఏడాదిలోనే కెమెరా ముందుకు రాబోతున్నారు.మొన్నటి వరకు కొందరు సీనియర్ స్టార్స్ వచ్చే ఏడాది వరకు కెమెరా ముందుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరిగింది.
కాని ఇప్పుడు వారే కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.