సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలలో ఎక్కువ ప్రాధాన్యత కథానాయకుడికి ఉంటుంది.కథానాయికగా నటించే వారి పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుంది.
మొదట్లో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకోవటం కోసం చాలామంది కమర్షియల్ సినిమాలలో హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు.కానీ ఒకసారి వారి కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న తరువాత ఇక సినిమా మొత్తం వాళ్ళ చుట్టూ తిరిగేలా లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్నారు.
ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో మన ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు నటించారు.ఆ సినిమా బరువు, బాధ్యతలను తనపై వేసుకుని మొత్తం సినిమాను నడిపిస్తున్నారు.ఇలాంటి సినిమాలలో హీరోయిన్ లే హీరో లై సినిమాను ముందుకు నడిపిస్తున్నారు.ఇండస్ట్రీలో అలా లేడి ఓరియెంటెడ్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం…
నయనతార:
లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడానికి నయనతార ముందు వరుసలో ఉంటారనే చెప్పవచ్చు.ఇప్పటికే ఈమె మహిళ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించారు.ప్రతి సంవత్సరం దాదాపు రెండు సినిమాలు మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించడంలో నయనతారకు ఎవరు సాటి లేరు అని చెప్పవచ్చు.
ఈ తరహాలోనే ప్రస్తుతం ‘నెట్రికన్’ అనే సినిమాలో నటించారు.తొందరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
రెజీనా:
తెలుగులో పలు కమర్షియల్ చిత్రాలలో నటించిన రెజీనా ప్రస్తుతం తన దృష్టిని మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాల వైపు మళ్ళింది.కార్తీక్ రాజు దర్శకత్వంలో ‘శూర్పణగై’ (తెలుగులో ‘నేనే నా’) చిత్రంలో నటిస్తున్నారు.అందులో ఆమె ఆర్కియాలజిస్ట్ పాత్రలో నటించనున్నారు.
విద్యాబాలన్:
మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలలో నటించడం లో విద్యాబాలన్ ముందుంటారు.ఈమె నటించిన స్మిత బయోపిక్ డర్టీ పిక్చర్స్ ఎంతో ఘన విజయం సాధించింది.ఇదే కాకుండా విద్యాబాలన్ మరిన్ని మహిళా ప్రాధాన్యమున్న సినిమాలలో నటించారు.
తాప్సీ:
ప్రముఖ హీరోల సరసన కమర్షియల్ సినిమాలలో నటించిన తాప్సి పెద్దగా అందరిని ఆకట్టుకోలేకపోయింది.కమర్షియల్ పాత్రలు పెద్దగా కలిసి రాకపోవడంతో మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో పై ఆమె దృష్టి పెట్టారు.ఇప్పుడామె క్రీడా నేపథ్య చిత్రం ‘రష్మీ రాకెట్’లో రష్మీ పాత్రలో నటిస్తున్నారు.వీరే కాకుండా అనుష్క, సమంత,త్రిష వంటి ప్రముఖ హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించారు.