స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ సినిమాలకు 2 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్న సంగతి తేసిందే.అయితే ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ తో సమంతకు ఇండియా అంతటా గుర్తింపు వచ్చింది.
సమంత సినిమాలో నటిస్తే ఆ సినిమా సక్సెస్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.చైతన్యతో విడాకుల తర్వాత తరచూ సమంత పేరు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వినిపిస్తోంది.
సోషల్ మీడియాలో సమంత గురించి కొన్ని పాజిటివ్ పోస్టులు కనిపిస్తుంటే ఎక్కువగా నెగిటివ్ పోస్టులు కనిపిస్తున్నాయి.అయితే విడాకుల ప్రకటన తర్వాత సమంత సినిమాల విషయంలో వేగం పెంచారు.
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో పాటు సమంత కొత్తగా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమాతో పాటు మరో సినిమాకు సమంత సంతకం చేశారు.
సమంత నటిస్తున్న రెండు సినిమాలు తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కనుండటం గమనార్హం.
అయితే సమంత ఒక బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ దక్కిందని ఆ సినిమా కోసం సమంత ఏకంగా 7 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.సమంతకు పాన్ ఇండియా స్థాయిలో ఉన్న గుర్తింపు వల్ల నిర్మాతలు సైతం అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
సమంత గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే సమంత స్పందించే వరకు ఆగాల్సిందే.సమంత కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.విడాకుల ప్రకటన తర్వాత కూడా సమంత సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సమంత సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాలకు నిర్మాతలకు విడుదలకు ముందే బిజినెస్ ద్వారా మంచి లాభాలు వస్తుండటం గమనార్హం.