టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.వరుసగా నచ్చిన ప్రాజెక్ట్ లకు ఓకే చెబుతున్న సమంత ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే స్టార్ హీరోయిన్ సమంత దీపావళి వేడుకలను ఉపాసనతో కలిసి జరుపుకున్నారు.ఉపాసన సమంత కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సమంత సోషల్ మీడియా చేసిన పోస్ట్ గురించి కూడా చర్చ జరుగుతోంది.
స్వీట్లలో ఉండే రుచి కరువైందని దీపావళి కాంతులు విరజిమ్మలేదని సమంత పేర్కొన్నారు.సంవత్సరం స్టార్టింగ్ లో ఏవైనా బాధలు కలిగితే ఆ తర్వాత వచ్చే పండుగలు అన్నీ చిన్న పండుగలు అవుతాయని సమంత చెప్పుకొచ్చారు.
త్వరలోనే ఈ బాధ నుంచి బయటపడి సంతోషంగా గడుపుతానని సమంత పేర్కొన్నారు.త్వరలో మీరు కూడా సంతోషాన్ని పొందుతారని ఆశిస్తున్నానని సమంత కామెంట్లు చేశారు.
సమంత సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
వరుసగా ప్రాజెక్ట్ లకు ఓకే చెబుతున్న సమంత పూర్వ వైభవం పొందాలని అనుకుంటున్నారు.ప్రస్తుతం నటించబోయే సినిమాల ఫలితాలే సమంత కెరీర్ ను డిసైడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.బాలీవుడ్ లో కూడా సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
రెమ్యునరేషన్ ను పెంచేసిన సమంత భవిష్యత్తు ప్రాజెక్టులు సక్సెస్ సాధిస్తే పారితోషికాన్ని మరింత పెంచే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొత్త సినిమాలకు సంబంధించి ఇతర వివరాలు త్వరలో తెలిసే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.సమంత తమిళ ప్రాజెక్టులపై కూడా దృష్టి పెడుతున్నారని వార్తలు వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.