స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా పోస్టుల గురించి అభిమానుల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది.అక్కినేని కుటుంబంలో ఏం జరుగుతుందో అర్థం కాక అక్కినేని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
సమంత, నాగచైతన్యల వివాహ బంధం గురించి ఎన్నో గాసిప్స్ ప్రచారంలోకి వస్తున్నాయి.ఆ గాసిప్స్ ను సమంత, నాగచైతన్య ఖండించకపోవడంతో ఆ వార్తలలో ఎంతోకొంత నిజం ఉందని చాలామంది నమ్ముతున్నారు.
నాగచైతన్య లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో సైతం సమంత గురించి ఎటువంటి ప్రశ్నలు అడగకూడదని మీడియాకు షరతులు పెట్టారని తెలుస్తోంది.సమంత సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవడం కూడా నెటిజన్లలో అనుమానాలు మరింత పెరగడానికి కారణమవుతోంది.
నిన్న ఏఎన్నార్ పుట్టినరోజు సందర్భంగా నాగార్జున తండ్రిని గుర్తు చేసుకుంటూ ఒక ట్వీట్ చేయగా ఆ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అయింది.
ఆ ట్వీట్ గురించి స్పందించిన సమంత నాగార్జున పేరుకు ముందు వెనుక ఎలాంటి గౌరవ సూచికలు లేకుండా పోస్ట్ పెట్టారు.
అయితే ఆ తర్వాత సమంత ఆ ట్వీట్ ను డిలేట్ చేసి మరో ట్వీట్ లో నాగార్జున మామ అంటూ సంబోధించారు.సమంత మొదటి ట్వీట్ తో ఫ్యాన్స్ లో అనుమానాలను మరింత పెంచేశారు.తాజాగా తిరుమలలో బుద్ధి ఉందా అంటూ రిపోర్టర్లపై సమంత మండిపడ్డారనే విషయం తెలిసిందే.
సమంత తన ప్రవర్తన ద్వారా అభిమానుల్లో సందేహాలను మరింత పెంచుతున్నారు.మరోవైపు శాకుంతలం సినిమాను పూర్తి చేసిన సమంత తెలుగులో కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పడం లేదు.సమంత సినిమాలతో బిజీ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
సమంత సినిమాలతో బిజీ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.సమంత చేతిలో ఒక తమిళ సినిమా మాత్రమే ఉంది.
తెలుగులో సమంత కొత్త ప్రాజెక్టులకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది
.