ఇతర హీరోయిన్లతో పొల్చి చూస్తే స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.నాగచైతన్యతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటూ సమంత వేర్వేరు విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు.
తాజాగా సమంత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.యంగ్ జనరేషన్ హీరోయిన్లకు కూడా సామ్ తన నటనతో గట్టి పోటీ ఇస్తున్నారు.
బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలలో కూడా సమంత ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు.తాజాగా సమంత క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.క్రమశిక్షణ అనేది మనల్ని బలంగా తయారు చేయడంలో ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. క్రమశిక్షణను కలిగి ఉండాలని ఎవరూ నొక్కి చెప్పాలని అనుకోరని సమంత కామెంట్లు చేశారు.
క్రమశిక్షణతో ఉండటం వల్ల కొన్నిసార్లు తాత్కాలిక ఆనందాలను పొందడం సాధ్యం కాదని ఆమె అన్నారు.
అయితే భవిష్యత్తులో మాత్రం మంచి ఫలితాలు దక్కుతాయని సమంత కామెంట్లు చేశారు.
జీవితంలో ఉన్నత శిఖరాలను చేరాలని అనుకుంటే క్రమశిక్షణే పునాది అని సమంత చెప్పుకొచ్చారు.ఇలా ఉండటం ద్వారా మనం కోరుకున్నవన్నీ మనకు దక్కుతాయని సమంత కామెంట్లు చేశారు.
మీరు కోరుకున్నవి మీకు ఇచ్చే విధంగా మిమ్మల్ని మీరు తప్పనిసరిగా ప్రేమించాలని సమంత చెప్పుకొచ్చారు.
పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ వల్ల సమంత పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిందనే సంగతి తెలిసిందే.సమంత నటించిన శాకుంతలం సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.అల్లు అర్హ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.
స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.కెరీర్ విషయంలో సమంత ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
సామ్ నటిస్తున్న సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.