సినిమా రంగంలో ఎంతోమంది హీరోలు ఉన్నా కొందరు హీరోలు మాత్రమే అందరివాడు అనిపించుకుంటారు.అలా అందరివాడు అనిపించుకున్న హీరోలలో పునీత్ రాజ్ కుమార్ కూడా ఒకరు.
అన్ని భాషల్లో అభిమానులను సొంతం చేసుకుని భారీ విజయాలను అందుకున్న పునీత్ మృతి గురించి హీరోయిన్ రోజా స్పందించడంతో పాటు భావోద్వేగానికి గురయ్యారు.తెలుగులో అమ్మానాన్న తమిళమ్మాయి అనే సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జయసుధ, రవితేజ ప్రధాన పాత్రల్లో నటించారు.అయితే ఈ సినిమా కన్నడలో మౌర్య పేరుతో రీమేక్ కాగా మౌర్య మూవీలో పునీత్ రాజ్ కుమార్, రోజా నటించారు.
కన్నడలో కూడా ఈ సినిమా సక్సెస్ సాధించి పునీత్ రాజ్ కుమార్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది.పునీత్ మృతి గురించి రోజా మాట్లాడుతూ తనకు కన్నీళ్లు ఆగడం లేదని కామెంట్లు చేశారు.
వయస్సులో తనకంటే పునీత్ కేవలం రెండు సంవత్సరాలు చిన్నవాడు అయినా తనను మమ్మీమమ్మీ అంటూ పునీత్ ప్రేమగా పిలిచేవాడని రోజా అన్నారు.
పునీత్ మృతితో తనకు నోట మాట రావడం లేదని రోజా చెప్పుకొచ్చారు.పునీత్ రాజ్ కుమార్ వయస్సులో చిన్న వ్యక్తే అయినా అతను చేసిన సేవాకార్యక్రమాలు అన్నీఇన్నీ కావని రోజా వెల్లడించారు.మంచివాళ్లను భగవంతుడు ఎందుకు ముందుగా తీసుకెళతాడో అర్థం కాదని రోజా పేర్కొన్నారు.
పునీత్ రాజ్ కుమార్ ప్రవర్తన చాలా హుందాగా ఉంటుందని గొప్పలకు పోకుండా పునీత్ ప్రవర్తిస్తారని రోజా వెల్లడించారు.పునీత్ మరణ వార్త తెలిసి తనకు ఎంతో బాధ కలుగుతోందని ఆమె పేర్కొన్నారు.పునీత్ అన్న శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన కొన్ని సినిమాలలో తాను హీరోయిన్ గా నటించానని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.