స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అందంగా కనిపించడంతో పాటు ఫిట్ నెస్ కు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే రకుల్ ప్రస్తుతం తెలుగు కంటే ఇతర భాషల సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తున్నారు.
రకుల్ గ్లామర్ సీక్రెట్ జిమ్, యోగా కాగా వీటితో పాటు మరో సీక్రెట్ కూడా ఉందని ఈ బ్యూటీ తన పోస్టుల ద్వారా చెప్పకనే చెప్పేస్తున్నారు.తాజాగా రకుల్ షేర్ చేసిన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ పోస్ట్ లో రకుల్ ప్రీత్ సింగ్ పెరుగన్నం తింటూ కనిపించారు.ఆ ఫోటోతో పాటు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఉబ్బరం లేకుండా ఉండాలన్నా పెరుగన్నం తినాలని రకుల్ సూచనలు చేశారు.రకుల్ నటించిన కొండపొలం సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుండగా హిందీలో రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో మేడే, థ్యాంక్ గాడ్, డాక్టర్ జీ సినిమాలు ఉన్నాయి.ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే రకుల్ బాలీవుడ్ కే పరిమితమయ్యే అవకాశం ఉంది.
ఎక్కువగా గ్లామర్ రోల్స్ లో నటించిన రకుల్ కొండపొలం సినిమలో భిన్నమైన పాత్రను ఎంచుకున్నారు.పెరుగన్నం తింటూ పోస్ట్ చేసిన ఫోటో గురించి రకుల్ చెబుతూ చియా ఫుడ్డింగ్, భారతీయ పెరుగును ఆస్వాదిస్తున్నానని చెప్పుకొచ్చారు.
చియాలో ఉండే ఫైబర్, పెరుగులో ఉండే ప్రత్యక్ష సూక్ష్మజీవులు కడుపును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయని రకుల్ చెప్పుకొచ్చారు.
కర్డ్ రైస్ తిన్న తర్వాత తనకు ఉల్లాసంగా, తేలికగా అనిపిస్తోందని ఆమె కామెంట్లు చేశారు.తప్పకుండా తను టేస్ట్ చేసే ఆహారాన్ని ట్రై చేయాలని రకుల్ అభిమానులకు సైతం సూచనలు చేశారు.రకుల్ షేర్ చేసిన ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.