కరోనా కష్టాల వల్ల నిర్మాతలు సినిమాల బడ్జెట్లు, అప్పు తెచ్చుకున్న మొత్తానికి వడ్డీలను కట్టలేక భయపడుతుంటే హీరోలు, హీరోయిన్లు మాత్రం భారీ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు.ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు కియారా అద్వానీ దాదాపుగా ఫైనల్ అయిందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం కియారా అద్వానీ ఏకంగా మూడు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
సౌత్ ఇండియా సినిమాలకు 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లు చాలా తక్కువమంది ఉండటం గమనార్హం.
కియారా అద్వానీ డిమాండ్ కు అనుగుణంగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ఓకే చెప్పినట్టేనని తెలుస్తోంది.త్వరలోనే ఈ సినిమాలో హీరోయిన్ తో పాటు ఇతర వివరాలు కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
ఇప్పటికే మహేష్ బాబు, చరణ్ లతో నటించిన కియారా అద్వానీ తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.కొరటాల శివ ఎన్టీఆర్ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలైతే అప్పుడు డేట్లు ఇస్తానని కియారా అద్వానీ చెప్పినట్టు సమాచారం.మరోవైపు శంకర్ రామ్ చరణ్ మూవీలో కూడా కియారా నటించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తూ ఉండటం గమనార్హం.
అయితే చరణ్ కియారా కాంబోలో వచ్చిన వినయ విధేయ రామ ఫ్లాప్ కావడంతో ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతుందో లేదో అనే సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి.మరి కొన్నిరోజులు ఆగితే కియారా నటించబోయే తెలుగు సినిమాలకు సంబంధించి స్పష్టత వస్తుందని చెప్పవచ్చు.కియారా మరో రెండు సినిమాల్లో నటిస్తే మాత్రం ఇక్కడ వరుస ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.