కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇప్పటికీ మిస్టరీనే అని చెప్పవచ్చు.పోలీసులు దర్యాప్తు చేసినా సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి ఖచ్చితమైన కారణాలు తెలియలేదు.
అయితే ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ సుశాంత్ ఆత్మహత్య గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.వాడే సుశాంత్ ను చంపేశాడంటూ ఒక హీరోపై ఆరోపణలు చేశారు.
కొన్ని రోజుల క్రితం కంగనా మాజీ ప్రియుడికి సంబంధించిన వ్యవహారం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారం గురించి కంగనా మాట్లాడుతూ కొంతమంది తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
కొందరు తనపై కావాలని బురద జల్లుతూ ఇన్ స్టాగ్రామ్ ఖాతా ఫాలోవర్లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అన్నారు.ఎవరైతే ఆ విధంగా చేస్తున్నారో వారిని రచ్చకీడుస్తానంటూ కంగనా హెచ్చరించారు.
తనను టార్గెట్ చేసి కొంతమంది అసభ్యంగా మీమ్స్ చేయడంతో పాటు తప్పు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.ప్లాన్ ప్రకారం ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని త్వరలో నిజానిజాలు వెల్లడవుతాయని కంగనా అన్నారు.సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నానని తన ఫాలోవర్లను తగ్గించే ప్రయత్నం చేస్తున్న వారి వివరాలు బయటపెడితే వారి విలువ వేరేగా ఉంటుందని చెప్పారు.
తనకు ఒక పనికిమాలిన లవర్ ఉన్నాడని.
అతనికి ఇప్పటివరకు పెళ్లి కాలేదని.బీరువాలో అస్థి పంజరాలను ఉంచుకున్న ఆ వ్యక్తే సుశాంత్ ను ఫినిష్ చేశాడని కంగనా అన్నారు.
త్వరలోనే ఆ వివరాలను కూడా బయట పెడతానని కంగనా పేర్కొన్నారు.మనం సంతోషంగా ఉంటే ఆ మాఫియా రాకెట్ వదిలిపెట్టదంటూ కంగనా రనౌత్ పేర్కొన్నారు.
కంగనా ప్రముఖ హీరోను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.