దండుపాల్యం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు అందరికి సుపరిచితమైన కన్నడ భామ పూజా గాంధీ.ఈ భామ కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి జోడీగా నటించి, కన్నడ నాట స్టార్ హీరోయిన్ గా మారింది.
ఇదిలా ఉంటే ఈ భామకి ఈ మధ్య కన్నడ ఇండస్ట్రీలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.అయితే తాజాగా బెంగుళూరు లో ఈ భామ చేసిన ఓ పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో పూజా గాంధీ కొన్ని రోజుల పాటు బస చేసింది.ఈ నేపధ్యంలో హోటల్ బిల్లు ఏకంగా నాలుగున్నర లక్షలు వచ్చింది.
అయితే ఒక్కసారిగా అంత బిల్లు రావడంతో చేతిలో ఆ స్థాయిలో డబ్బులు లేకపోవడం ఈ భామ హోటల్ నుంచి ఊహించని విధంగా జంప్ అయిపోయినట్లు తెలుస్తుంది.బయటకి వెళ్ళిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకి ఫిర్యాదు చేసారు.
దీంతో పోలీసులు ఆమెకి నోటీసులు జారీ చేయగా తాను రెండు లక్షలు చెల్లించానని, మిగిలిన మొత్తం కొంత సమయం ఇస్తే చెల్లిస్తానని ఈ భామ పోలీసులని కోరినట్లు తెలుస్తుంది.