టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే గత కొన్నేళ్లుగా వరుస విజయాలను సొంతం చేసుకుంటూ గోల్డెన్ లెగ్ గా పాపులర్ అయ్యారు.ఫ్లాపుల్లో ఉన్న హీరోలు సైతం పూజా హెగ్డేతో కలిసి నటిస్తే తమ సినిమా సక్సెస్ అవుతుందని భావించారు.
కొందరు స్టార్ హీరోల విషయంలో ఈ సెంటిమెంట్ నిజం కావడం గమనార్హం.అయితే 2022 సంవత్సరం మాత్రం పూజా హెగ్డేకు అస్సలు కలిసిరాలేదు.
గతేడాది వరకు వరుసగా సక్సెస్ లు అందుకున్న ఈ బ్యూటీ రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాల ఫలితాల వల్ల తీవ్రస్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొన్నారు.ఈ మూడు సినిమాలు ఫ్లాప్ కావడానికి వేర్వేరు కారణాలు ఉన్నా కొంతమంది నెటిజన్లు మాత్రం టార్గెట్ చేసి పూజా హెగ్డేను ట్రోల్ చేయడం గమనార్హం.
ఈ ట్రోల్స్ వల్ల పూజా హెగ్డేకు కొత్త ఆఫర్లు రావడం కష్టమేనని ప్రచారం జరిగింది.అయితే పూజా హెగ్డేకు మాత్రం కొత్త సినిమా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.
మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైనట్టు గతేడాది ప్రకటన వెలువడింది.
జూన్ నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.త్రివిక్రమ్ ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ ను లాక్ చేశారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.అయితే పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కనున్న జనగణమన సినిమాలో కూడా పూజా హెగ్డేకు ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది.
బాలీవుడ్ మీడియాలో ఈ మేరకు కథనాలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి.అయితే అధికారిక ప్రకటన వస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలు తెలిసే ఛాన్స్ ఉంది.విజయ్ దేవరకొండ ఇప్పటికే అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్నారు.లైగర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంటానని విజయ్ దేవరకొండ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
విజయ్ పూజా హెగ్డే కాంబోలో సినిమా వస్తుందో లేదో చూడాల్సి ఉంది.