భారత్ లో ఎంతోమంది ఎంతో ఇష్టంగా జరుపుకొనే పండుగల్లో దీపావళి మొదటగా నిలబడుతుంది.మతాలకు సామరస్యంగా దీపావళి పండుగను అందరూ జరుపుకోడానికి ఇష్టపడతారు.
పేదరికంలో ఉన్న ప్రజల నుండి సెలబ్రిటీల వరకు దీపావళి దేదీప్యమానంగా చేసుకోవాలని అని అనుకుంటారు.ఇకపోతే ప్రస్తుతం కరోనా వైరస్ జాగ్రత్తలు తీసుకుంటూనే పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇంటి ముందర దీపాలు వెలిగించడం, తర్వాత ఇంట్లో పూజ చేయడం, ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి టపాకాయలు కాల్చడం లాంటి పనులు చేసి దీపావళి పండుగ బాగా ఎంజాయ్ చేస్తారు.అసలు విషయంలోకి వెళితే.
ఒకప్పుడు దక్షిణ భారతదేశం లోని టాప్ హీరోయిన్ లలో ఒకటైన జెనీలియా తన భర్త బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ తన పిల్లలతో కలిసి తాజాగా దీపావళి వేడుకల్లో మునిగితేలారు.ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
ఇకపోతే ఈ వీడియోలో ఓ ప్రత్యేకత ఉంది.అదేమిటంటే రితీష్ తల్లికి సంబంధించిన ఓ పాత చీరను ఉపయోగించి కొత్త బట్టలను కుట్టించారు.అలా కుట్టించిన బట్టలు రితీష్ దేశముఖ్ తో పాటు ఆయన కొడుకులు కూడా ధరించారు.దీంతో తండ్రి కొడుకులు అందరు కూడా ఒకే రంగు దుస్తులు తొడుక్కొని మెరిసిపోతూ ఉన్న సమయంలో లో హీరోయిన్ జెనీలియా వారికి సంబంధించిన వీడియోని చిత్రీకరించింది.
అలా చిత్రీకరించిన వీడియోను రితీష్ దేశ్ ముఖ్ తన ఖాతా ద్వారా షేర్ చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో భారత్ లో బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది.ఈ వీడియో ని చూసిన అభిమానులు రితీష్ దేశ్ ముఖ్ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.పెద్ద ఎత్తున ఆ వీడియోకు ప్రశంసలు లభిస్తున్నాయి.
నెటిజెన్స్ ఎందరో సూపర్ ఐడియా అంటూ ఆయనను ప్రశంసించారు.ఇకపోతే జెనీలియా రితీష్ దేశ్ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.
ఇకపోతే పెళ్లికి ముందు జెనీలియా ఇటు దక్షిణ భారతదేశంలో అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ బిజీగా జీవితాన్ని గడిపింది.పెళ్లి తర్వాత మాత్రం ఆవిడ ఇండస్ట్రీలో కూడా సినిమాలలో నటించలేదు.
అయితే అప్పుడప్పుడు రితీష్ నటించిన సినిమాలలో లేకపోతే నిర్మించే సినిమాలలో ఆవిడ అతిథి పాత్రలో కనబడుతుంటుంది.బాలీవుడ్ లో జెనీలియా కు అంత క్రేజ్ లేకపోయినా సరే దక్షిణ భారతదేశంలో ఉన్న ఇండస్ట్రీలలో ఆవిడ కు మంచి క్రేజ్ ఉంది.