టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు.
ఇప్పటికే సలార్ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోగా ఈరోజు ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఊహించని అప్ డేట్ వచ్చింది.ఫిబ్రవరి 2వ తేదీన లాంఛనంగా ఈ సినిమా ప్రారంభం కానుంది.
ఈ సినిమాకు సంబంధించిన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వర్క్ ను ఆదిపురుష్ సినిమా బృందం ఈరోజు నుంచి ప్రారంభించనుంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2022 సంవత్సరం ఆగష్టు నెల 11వ తేదీన విడుదల కానుందని తెలుస్తోంది.
ఈ ఏడాది సెకండాఫ్ లో ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లోని సినిమా కూడా ప్రారంభం కానుందని తెలుస్తోంది.అయితే ప్రభాస్ సినిమాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా మిగిలిన మూడు సినిమాలు పూర్తైన తరువాత ప్రభాస్ సినిమా ఇండస్ట్రీకి సంవత్సరం పాటు గ్యాప్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.అయితే ప్రభాస్ నిజంగా గ్యాప్ ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది.ప్రభాస్ రెండేళ్ల వరకు వరుస షూటింగ్ లతో బిజీగా ఉంటారని ఆ తరువాత ఏడాది పాటు సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇవ్వనున్నారని సమాచారం.
ప్రభాస్ కొన్నేళ్లుగా రెస్ట్ లేకపోవడంతో గ్యాప్ తీసుకుంటున్నాడని కొందరు చెబుతుంటే మరి కొందరు మాత్రం ప్రభాస్ పెళ్లి కోసం గ్యాప్ తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
నాగ్ అశ్విన్ సినిమా తరువాత ప్రభాస్ సినిమాలకు బ్రేక్ తీసుకోనుండగా ఆ వార్తలు నిజమో కాదో తెలియాల్సి ఉంది.
.