స్టార్ హీరో ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు.ప్రస్తుతం ప్రభాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ మూవీలో పూజా హెగ్డేతో కలిసి నటిస్తుండగా ప్రస్తుతం ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది.
బాహుబలి సిరీస్ ప్రభాస్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపును తెచ్చిపెట్టింది.ఈ మూవీకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు లీకయ్యాయి.
ఈ మధ్య కాలంలో యాక్షన్ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్న ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా కోసం రూటు మార్చారు.దాదాపు మూడు సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న రాధేశ్యామ్ ఎప్పుడు రిలీజవుతుందో తెలియాల్సి ఉంది.
కొన్నిసార్లు ఆటంకాలు ఎదురవుతూ ఉండటంతో ఈ మూవీ షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.ఈ సినిమా పునర్జన్మ కథాంశంతో తెరకెక్కనుందని గతంలోనే వార్తలు వచ్చాయి.
సినిమా కథ ప్రకారం ఇంటర్వెల్ కు ముందు ప్రభాస్ కు గతం గుర్తుకు వస్తుందని ఆ సమయంలో తన ప్రియురాలు చనిపోవడం వెనుక మిస్టరీ ఉందని ప్రభాస్ కు తెలుస్తుందని సమాచారం.ఆ మిస్టరీని కనుగొనడానికి ప్రభాస్ చేసే ప్రయత్నాలకు సంబంధించిన కథతో సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.ప్రభాస్, పూజా హెగ్డేతో కలిసి ప్రయాణం చేసే రైలు సొరంగంలో మాయమవుతుందని తెలుస్తోంది.
ఆ తరువాత వీళ్లు చనిపోయారని పత్రికల్లో వార్తలు వస్తాయి.ఆ సొరంగంలో ఏం జరిగిందో అదే సినిమాకు భారీ ట్విస్ట్ గా ఉండనుందని తెలుస్తోంది.
ప్రభాస్ చరిత్రను తిరిగేయడంతో పాటు ఆ ప్రమాదం జరగడానికి గల అసలు కారణాలను కనిపెడతారని సమాచారం.ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.