బుల్లితెరపై ఎన్ని రియాలిటీ షోలు ఉన్నా ఆ షోలు ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అవుతుండగా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో మాత్రం ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది.ప్రధానంగా బాలయ్య హోస్టింగ్ ఈ షోను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది.
అన్ స్టాపబుల్ షోకు బాలయ్య హోస్ట్ గా ఫిక్స్ అయ్యారని వినిపించిన సమయంలో ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేశారు.ఈ షో మొదలయ్యే సమయానికి బాలయ్య కూడా వరుస ఫ్లాపులతో సతమవుతున్నారు.
అయితే ఫ్యాన్స్ లో నెలకొన్న అనుమానాలను బాలయ్య పటాపంచలు చెయ్యడానికి ఎక్కువ సమయం పట్టలేదు.అయితే ప్రస్తుతం అన్ స్టాపబుల్ షోకు పెళ్లి కాని హీరోలు వెళితే ఆ హీరోలకు పెళ్లవుతుందన్ కామెంట్లు వినిపిస్తున్నాయి.
తాజాగా జరిగిన ఘటనల వల్ల ఈ సెంటిమెంట్ నిజమేనని ఫ్యాన్స్ కూడా నమ్మాల్సి వస్తోంది.అన్ స్టాపబుల్ షోకు హాజరైన శర్వానంద్ పెళ్లి రక్షితా రెడ్డితో ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ప్రభాస్ కు కూడా పెళ్లి ఫిక్స్ అయిందని సమాచారం అందుతోంది.ప్రభాస్ పెళ్లికి సంబంధించి త్వరలో అధికారికంగా వివరాలు వెల్లడి కానున్నాయి.ప్రభాస్ కూడా ఒక ఇంటివాడు కానున్నాడనే వార్త ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది.అయితే ప్రభాస్ ఈ విషయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో తెలియాల్సి ఉంది.
శర్వానంద్, ప్రభాస్ పెళ్లిళ్లు కొన్ని నెలల గ్యాప్ లో జరగనున్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నప్పటికీ వయస్సు పెరుగుతున్న నేపథ్యంలో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.ప్రభాస్ మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.తాజాగా బాలయ్య పవన్ ఎపిసోడ్ కు సంబంధిన ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోకు ఊహించని స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.
ఈ ఎపిసోడ్ ప్రోమోలో పవన్ తో పాటు సాయితేజ్ కూడా పాల్గొని సందడి చేశారు.