యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమా కమిట్మెంట్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.2021 ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ విడుదల కానుండగా 2021 దసరాకు సలార్ సినిమా విడుదలయ్యేలా ప్రభాస్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.సినిమాసినిమాకు ఎక్కువగా గ్యాప్ వస్తున్న నేపథ్యంలో ఇకపై అలా జరగకుండా ప్రభాస్ జాగ్రత్త పడుతున్నారు.ఇకపై కనీసం ఏడాదికి ఒక సినిమా అయినా విడుదల కావాలని ప్రభాస్ భావిస్తున్నారని తెలుస్తోంది.
పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ భవిష్యత్తు సినిమాలలో ఒక్కో సినిమాకు 80 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం.ఎప్పుడూ సినిమాల ద్వారా వార్తల్లో నిలిచే ప్రభాస్ తాజాగా ఫామ్ హౌస్ ద్వారా వార్తల్లోకెక్కాడు.గతంలో ఈ ఫామ్ హౌస్ కోర్టు వివాదంలో చిక్కుకుని వార్తల్లోకెక్కగా ప్రభాస్ తన ఫామ్ హౌస్ ను మరింత అప్ గ్రేడ్ చేయడంతో మరోసారి వార్తల్లోకెక్కారు.ప్రభాస్ ఫామ్ హౌస్ లో చెట్లు పెంచడంతో పాటు అక్కడ వాతావరణం ఆహ్లాదంగా ఉండేలా ఏర్పాట్లు చేశారట.
ప్రభాస్ ఫామ్ హౌస్ విలువ ఏకంగా 60 కోట్ల రూపాయలని సమాచారం.ప్రభాస్ తీసుకునే రెమ్యునరేషన్ తో పోల్చి చూస్తే ఈ మొత్తం తక్కువే అయినా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది సినీప్రముఖులకు మాత్రమే ఇంత విలువ చేసే ఫామ్ హౌస్ లు ఉన్నాయి.
కొన్ని రోజుల క్రితం ప్రభాస్ మొక్కలు నాటిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఎంపీ సంతోష్ తో కలిసి ఈ ఫామ్ హౌస్ లోనే ప్రభాస్ మొక్కలు నాటారు.
ప్రభాస్ షూటింగ్ లు లేకపోతే ఎక్కువ సమయం ఈ ఫామ్ హౌస్ లోనే గడుపుతారు.మరోవైపు ప్రభాస్ పాన్ ఇండియా కథలను మాత్రమే ఎంచుకుంటున్నాడని.
సాదాసీదా కథలు చెబితే రిజెక్ట్ చేస్తున్నాడని తెలుస్తోంది.అయితే ప్రభాస్ సినిమాలు భారీ బడ్జెట్లతో తెరకెక్కుతూ ఉండటంతో సినిమా హిట్టైతే సమస్య లేదు కానీ ఫ్లాప్ అయితే మాత్రం భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.