గత కొన్నిరోజులుగా ఊహించని స్థాయిలో పవన్ కళ్యాణ్ పోసాని కృష్ణమురళి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో కామెంట్లు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం పోసాని గురించి ప్రత్యక్షంగా విమర్శలు చేయలేదు.
మరోవైపు పోసాని నిన్నటినుంచి మీడియా ముందుకు రావడం లేదు.అయితే పవన్ మాత్రం వరుసగా సమావేశాలలో పాల్గొంటూ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
తాజాగా పవన్ కళ్యాణ్ ను పలువురు స్టార్ ప్రొడ్యూసర్స్ కలిసిన సంగతి తెలిసిందే.ఈ సమావేశంలో పోసాని కృష్ణమురళి గురించి చర్చ జరిగిందని కొందరు నిర్మాతలు పోసానిని బ్యాన్ చేస్తామని కామెంట్లు చేసినా పవన్ మాత్రం వద్దని చెప్పారని తెలుస్తోంది.
పోసాని పవన్ గురించి షాకింగ్ కామెంట్లు చేసినా పవన్ మాత్రం పోసానిపై సీరియస్ కాకపోవడం గమనార్హం.అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం పోసాని ఇంటిపై రాళ్లు విసిరారు.
సోషల్ మీడియాలో సైతం పవన్ ఫ్యాన్స్ పోసానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.
మరోవైపు కరోనా పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లలేమని నిర్మాతలు పవన్ కు చెప్పారని సమాచారం.మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం రాజకీయాలకు, సినిమా రంగానికి సంబంధం లేదని చెప్పినట్టు తెలుస్తోంది.పవన్ పోసానిని క్షమించినట్లే అని అర్థమవుతోంది.
పవన్ ప్రస్తుతం సినిమా టికెట్ల విషయంపై కామెంట్లు చేయకుండా ఇతర సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు.మరోవైపు పవన్ కళ్యాణ్ చేస్తున్న కామెంట్ల వల్ల జనసైనికులు సంతోషిస్తున్నారు.2024 ఎన్నికల్లో ఏపీలో జనసేన చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సాధిస్తుందని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.జనసేన 2019 ఎన్నికల్లో మంచి ఫలితాలను సొంతం చేసుకోలేకపోయినా 2024 ఎన్నికల్లో మాత్రం పార్టీని బలోపేతం చేయడానికి పవన్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.