పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కొన్ని సినిమాలు మాత్రం నిర్మాతలకు ఊహించని స్థాయిలో నష్టాలను మిగిల్చాయి.పవన్ కెరీర్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో అజ్ఞాతవాసి ఒకటి.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.2018 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.
మరోవైపు ఈ సినిమా హాలీవుడ్ సినిమాకు కాపీ అనే కామెంట్లు సైతం వినిపించడం గమనార్హం.నిన్నటికి ఈ సినిమా విడుదలై నాలుగు సంవత్సరాలు పూర్తైంది.ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటించగా ఈ సినిమా తర్వాత ఈ హీరోయిన్లకు సైతం సినిమా ఆఫర్లు తగ్గాయి.ఈ సినిమా కథనంలో లోపాలు ఉన్నా పవన్ కళ్యాణ్ నటనకు మాత్రం మంచి పేరు వచ్చింది.
ఈ సినిమా కలెక్షన్లు 57 కోట్ల రూపాయలు కాగా నష్టాలు 58 కోట్ల రూపాయలు అని సమాచారం.
రికార్డు స్థాయిలో అజ్ఞాతవాసి సినిమాకు బిజినెస్ జరగడం వల్లే ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయి.అత్తారింటికి దారేది సినిమా తర్వాత అదే కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమా కొరకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు.అయితే అటు క్లాస్ ప్రేక్షకులను ఇటు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా ఫెయిలైంది.
ఈ సినిమా వల్ల బయ్యర్లకు నష్టాలు వచ్చాయి.
నష్టపోయిన బయ్యర్లను ఆదుకోవడానికి నిర్మాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయం చేశారు.పవన్ కెరీర్ లోనే భారీ నష్టాలను మిగిల్చిన సినిమాగా ఈ సినిమా రికార్డులకెక్కింది.ఈ సినిమా తర్వాత రాజకీయాలతో బిజీ కావడంతో పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమయ్యారు.
అయితే రాజకీయాల్లో కూడా పవన్ కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.