టాలీవుడ్ ఇండస్ట్రీలో భిన్నమైన కథలను ఎంచుకునే హీరోగా కొత్త దర్శకులకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చే హీరోగా కింగ్ అక్కినేని నాగార్జునకు పేరుంది.ప్రయోగాలకు పెద్దపీట వేసే నాగార్జున ఆ ప్రయత్నంలో ఎక్కువగా విజయాలనే అందుకున్నారు.
అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం హిట్టవుతాయని అనుకున్న సినిమాలు ఫ్లాపై నాగార్జునకు భారీ షాక్ ఇచ్చాయి.అలాంటి సినిమాలలో నాగ్ నటించిన క్రిమినల్ మూవీ కూడా ఒకటి.
బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ను సంపాదించుకున్న మహేష్ భట్ తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక సినిమా క్రిమినల్ కావడం గమనార్హం.మనీషా కోయిరాలా, రమ్యకృష్ణ క్రిమినల్ మూవీలో హీరోయిన్లుగా నటించారు.
ఈ సినిమాలో స్టార్ హీరో నాగార్జున డాక్టర్ అజయ్ పాత్రలో నటించడం గమనార్హం.ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇంగ్లీష్ సినిమా అయిన ఫ్యూజిటివ్ ను పోలి ఉంటాయి.
కింగ్ నాగార్జున బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుందని బలంగా నమ్మారు.ఈ సినిమా కొరకు నాగ్ గడ్డం కూడా పెంచడం గమనార్హం.
క్రిమినల్ మూవీ షూటింగ్ జరిగిన సమయంలో నాగార్జున మరో సినిమాపై ఆసక్తి చూపించలేదు.ఈ సినిమా రీరికార్డింగ్ పనులను సైతం నాగార్జున పర్యవేక్షించారు.కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించగా ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
సాధారణంగా స్టార్ హీరోలు రీరికార్డింగ్ పనులను పెద్దగా పట్టించుకోరు.కానీ నాగార్జున మాత్రం ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు.అయితే నాగార్జున ఎంతో ఇష్టపడి చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.
అయితే స్టార్ హీరో నాగార్జున అభిమానులను మాత్రం ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది.స్టార్ హీరో నాగార్జున ప్రస్తుతం బంగార్రాజు, ది ఘోస్ట్ సినిమాలలో నటిస్తున్నారు.