ప్రముఖ తెలుగు సినీ నటుడు విక్రమ్.తన నటన తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విక్రమ్ ఎన్నో సినిమాలలో నటించాడు.
తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా కొన్ని సినిమాలలో నటించాడు.ఆయన నటనకు ఉత్తమ నటుడు అవార్డు కూడా అందుకున్నాడు.
1993లో దాసరి నారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అక్క పెత్తనం చెల్లెలి కాపురం లో నటించి తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు.ఆ తర్వాత చిరునవ్వుల వరమిస్తావా అన్న సినిమాలో నటించగా ఇప్పటికీ విడుదల కాలేదు.ఇక ఎన్నో సినిమాలలో నటించిన విక్రమ్ మల్లన్న, నాన్న, ఐ సినిమా లతో మంచి విజయం అందుకున్నాడు.2019లో మిస్టర్ కేకే సినిమాలో నటించాడు.అంతే కాకుండా కొన్ని ప్రకటనల్లో కూడా నటించాడు విక్రమ్.
ఇదిలా ఉంటే బుల్లితెరలో ప్రసారమయ్యే సీరియల్స్, యాడ్స్ గురించి మనకు తెలిసిందే.
ఇక రకరకాల యాడ్స్ లు వస్తుంటాయి.అందులో వ్యాపార, వాణిజ్య ప్రకటనలు ఎక్కువగా వస్తుంటాయి.
ఇక యాడ్స్ మరింత గుర్తింపు పొందడానికి.యాడ్స్ డైరెక్టర్ లు ఎన్నో సన్నివేశాలను ప్రత్యేకంగా చేస్తుంటారు.
అంతేకాకుండా ఓ చిన్న ప్రకటన కోసం దాదాపు కొన్ని నిమిషాల వరకు ప్రకటిస్తారు.
ఇంకా వాటిని జూనియర్ ఆర్టిస్టులతో కాకుండా కొన్ని కొన్ని సందర్భాలలో ఆ ప్రాడెక్ట్ మంచి గుర్తింపు పొందడానికి సినీ నటి నటులతో చేయిస్తారు.దీనివల్ల ఆ ప్రాడెక్ట్ ను ప్రేక్షకులు ఆసక్తి చూపడానికి ముందుకు వస్తుంటారు.ఇదిలా ఉంటే పార్లే జి బిస్కెట్ ను మన చిన్నప్పటి నుంచీ చూస్తూనే ఉన్నాం.
ఇప్పటికీ ఆ బిస్కెట్ మనకు మార్కెట్ లో దొరుకుతుండగా.ఆ బిస్కెట్ ప్రకటన మాత్రం ఎన్నో రకాలుగా చూపించారు యాడ్స్ డైరెక్టర్ లు.
ఇక ఒకప్పుడు ప్రకటించిన పార్లే జి బిస్కెట్ యాడ్స్ లో కొందరు జూనియర్ ఆర్టిస్టులు రకరకాలు గా నటించగా.హీరో విక్రమ్ కూడా ఈ యాడ్ లో చేశాడు.
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం వల్ల అప్పటి వీడియోలు ప్రస్తుతం బాగా ప్రసారమవుతున్నాయి.విక్రమ్ నటించిన ప్రకటనను ఓల్డ్ స్వీట్ మెమరీస్ అనే యూట్యూబ్ ఛానల్ విడుదల చేయగా.
అందులో విక్రమ్ తన చేతిలో ఉన్న ఫోన్ ని చూడగా అది పెద్దది గా కనిపిస్తుంది.అంతేకాక ఓ కుక్కపిల్లను చూడగా అది కూడా పెద్దగా మారుతుంది.
ఆమెకు ఒకేసారి లావుగా అయినట్టు కనిపిస్తుంది.దీంతో ఆయన అదంతా భ్రమ అనుకుంటూ ఓ షాప్ లోకి వెళతాడు.
ఇక ఆయన అందులో పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ ను కొనగా అది ఆయన చేతిలో చూస్తుండగానే అది కూడా పెద్దదిగా మారగా 20 శాతం ఎక్స్ ట్రా బిస్కెట్లు ఉన్నట్టు చూపించారు.అంటే పార్లే జీ బిస్కెట్ తో ఉన్నదానికంటే 20% ఎక్కువగా దొరుకుతుందని ఆ యాడ్ ద్వారా ప్రేక్షకులకు అర్థమయ్యేలా ప్రకటించారు.