దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తోక ముడిచినట్లే మడిచి మరోసారి తన పంజా విసురుతోంది.ప్రస్తుతం దేశంలో పలు రాష్ట్రాలలో ఈ మహమ్మారి చాపకింద నీరులా పాకిపోతోంది.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.తాజాగా కమల్ హాసన్, కరీనా కపూర్ మంచు మనోజ్ వంటివారు ఈ మహమ్మారి బారిన పడగా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అతని భార్య కూడా కరోనా బారిన పడ్డారు.
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంతో పాటు ఆయన భార్య రూంచల్ కరోనా బారిన పడినట్లుగా అధికారికంగా ప్రకటించారు.గత కొద్ది రోజుల క్రితం జాన్ అబ్రహం ఓ వ్యక్తిని కలిశారని అయితే అతనికి పాజిటివ్ అని తెలియడంతో జాన్ అబ్రహం అప్రమత్తమై కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.
దీంతో అతనికి కూడా పాజిటివ్ అని రాగా తన భార్య కూడా కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవడంతో ఆమెకు కూడా పాజిటివ్ అని వచ్చింది.
ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్యం గురించి ఏ విధమైనటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదని వీరిద్దరు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.అయితే వీరిద్దరూ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ వీరిలో స్వల్ప లక్షణాలు కనిపించాయని అందుకోసమే నిర్ధారణ పరీక్షలు చేయించగా పాజిటివ్ గా నిర్ధారణ జరిగినట్లు తెలియజేశారు.