స్టార్ హీరో బాలకృష్ణ, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రావాలని బాలయ్య అభిమానులలో చాలామంది భావిస్తున్నారు.బాలయ్య నటించిన చాలా సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ రచయితగా పని చేశారు.
బాలయ్య నటించిన అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే.ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి మట్లాడుతూ బాలయ్య ఆటంబాంబు అని అఖండ మూవీ పెద్ద హిట్ కావడంతో పాటు ఇండస్ట్రీకి కొత్త ఊపును తీసుకురావాలని రాజమౌళి తెలిపారు.
అయితే రాజమౌళి కోరుకున్న విధంగానే బాలయ్య అఖండ సినిమా సంచలన విజయం సాధించింది.ఈ మధ్య కాలంలో ఏ సినిమా సాధించని స్థాయిలో అఖండ మూవీ కలెక్షన్లను సాధిస్తోంది.
ఈ వీకెండ్ నాటికి ఈ సినిమా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది.పెద్ద సినిమాలను రిలీజ్ చేయాలా? వద్దా? అని నిర్మాతలు టెన్షన్ పడుతున్న సమయంలో అఖండ ఇండస్ట్రీ వర్గాలలో భరోసాను నింపడం గమనార్హం.
ఈ నెలలో భారీ బడ్జెట్ సినిమాలైన పుష్ప, శ్యామ్ సింగరాయ్ విడుదల కానున్నాయి.2022 సంవత్సరం జనవరిలో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి.రాజమౌళి అఖండ సక్సెస్ కావాలని బలంగా కోరుకోగా ఆయన కోరిక నెరవేరింది.రాజమౌళి సైతం ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచారు.ఆర్ఆర్ఆర్ ట్రైలర్ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది.
తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ ను ప్రదర్శించనున్నారని తెలుస్తోంది.500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ కు ఊహించని స్థాయిలో బిజినెస్ జరిగింది.ఇప్పటికే విడుదలైన అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రల పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.