స్టార్ హీరో బాలకృష్ణ గతంలో పలు సందర్భాల్లో అభిమానులపై చేయి చేసుకున్నారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి.ఆ సమయంలో కొంతమంది సోషల్ మీడియాలో బాలకృష్ణపై తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్లు చేశారు.
అయితే బాలకృష్ణ అభిమానికి కష్టం కలిగిందంటే మాత్రం స్పందించడంలో ముందువరసలో ఉంటారు.అభిమానులకు ప్రాధాన్యత ఇచ్చే కొద్దిమంది హీరోలలో బాలకృష్ణ కూడా ఒకరు.
స్టార్ హీరో బాలకృష్ణ తాజాగా మరోసారి తన గొప్పమనస్సును చాటుకున్నారు.నంబూర్ సతీష్ బాబు అనే బాలకృష్ణ అభిమాని ప్రస్తుతం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
సతీష్ బాబు అఖిల భారత బాలకృష్ణ అభిమాన సంఘానికి కన్వీనర్ కూడా కావడం గమనార్హం.ఈరోజు సతీష్ బాబు పుట్టినరోజు కాగా బాలయ్య అభిమానిని పరామర్శించడంతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
నంబూరి సతీష్ బాబు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని బాలకృష్ణ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు.బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ను తల్లి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఆస్పత్రి ద్వారా బాలకృష్ణ క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స అందేలా చేస్తున్నారు.ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
త్వరలో బాలయ్య నటించిన అఖండ మూవీ కొత్త రిలీజ్ డేట్ రానుంది.
అఖండ సినిమాలో రెండు పాటల షూటింగ్ జరగాల్సి ఉంది.అఖండ మూవీ షూటింగ్ పూర్తైతే గోపీచంద్ మలినేని డైరెక్షన్ సినిమాలో నటించనున్నారు.అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాకు బాలకృష్ణ ఓకే చెప్పిన విషయం తెలిసిందే.
దర్శకుల ఎంపిక విషయంలో బాలకృష్ణ గతంతో పోలిస్తే మారారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.యంగ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్లకు బాలకృష్ణ తన సినిమాలకు దర్శకత్వం వహించే ఛాన్స్ ఎక్కువగా ఇస్తున్నారు.