ఏ స్టార్ హీరో అయినా కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలంటే ట్రెండ్ కు అనుగుణంగా కథలను, దర్శకులను ఎంపిక చేసుకోవాలి.బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ కు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది.
ఈ కాంబినేషన్ లో ఏ సినిమా తెరకెక్కినా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది.అయితే ఈ మధ్య కాలంలో బాలయ్య ఏదైనా సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కు పిలిస్తే హాజరవుతూ సినిమా బాగుంటే ఆ దర్శకునికి ఛాన్స్ ఇస్తున్నారు.
రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కిన క్రాక్ సినిమా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరైన బాలయ్య క్రాక్ కథనం, గోపీచంద్ మలినేని డైరెక్షన్ స్కిల్స్ నచ్చి గోపీచంద్ మలినేనికి ఛాన్స్ ఇచ్చారు.
ఈ కాంబినేషన్ లో జై బాలయ్య పేరుతో ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే.
త్వరలో మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది.సరిలేరు నీకెవ్వరు సినిమాను చూసిన బాలయ్య ఆ సినిమాలో అటు మాస్ సన్నివేశాలను, ఇటు కామెడీ సన్నివేశాలను అనిల్ రావిపూడి హ్యాండిల్ చేసిన విధానం నచ్చి ఆయనకు ఛాన్స్ ఇచ్చారు.ప్రస్తుతం బాలయ్య మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే సంగతి తెలిసిందే.
బింబిసార సినిమా సక్సెస్ సాధించడంతో పాటు వశిష్ట ఆ సినిమాను డీల్ చేసిన విధానం నచ్చడంతో వశిష్ట డైరెక్షన్ లో నటించడానికి బాలయ్య ఓకే చెప్పారు.ఈ సినిమా కూడా బాలయ్య స్పెషల్ స్క్రీనింగ్ లో చూశారు.టాలెంట్ ఉన్న దర్శకులు మాస్ సినిమాలను బాగా డీల్ చేయగలమని నమ్మకాన్ని కలిగిస్తే బాలయ్య సినిమాకు పని చేసే ఛాన్స్ దక్కినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.దర్శకుల ఎంపిక విషయంలో బాలయ్య రూటు మార్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.