బాలకృష్ణ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు కామెడీ షో ల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇలా అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న బాలయ్య ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమం మొదటి సీజన్ విజయవంతం కావడంతో రెండవ సీజన్ కూడా అంతే ఘనంగా ప్రారంభించారు.అయితే ఈ కార్యక్రమానికి సినీ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా వస్తున్న సంగతి తెలిసిందే.
ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ప్రస్తుత తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి రాధిక హాజరయ్యారు.ఇక కిరణ్ కుమార్ రెడ్డి బాలకృష్ణకు మంచి స్నేహితుడు కావడంతో ఈయనని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వీరి కాలేజీ రోజులను గుర్తు చేసుకోవడమే కాకుండా ఏపీ రాష్ట్ర రాజకీయాల గురించి కూడా బాలకృష్ణ కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు.
ఇకపోతే ఈ కార్యక్రమం చివరిలో బాలకృష్ణ ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ కూడా హాజరయ్యారు.
ఇందులో ఒక ఫ్రెండ్ ఆశ గుర్తుందా అంటూ ప్రశ్నించగా ఎందుకు గుర్తులేదు అంటూ ఈయన ఆశ హాస్పిటల్ గురించి చెప్పుకొచ్చారు.హాస్పిటల్ కాదు ఆశ గుర్తుందా అంటూ ప్రశ్నించగా వెంటనే బాలయ్య తన నోరు మూసివేశారు.దీంతో కాలేజీ రోజుల్లో బాలకృష్ణకు ఆశ అనే అమ్మాయితో ఫస్ట్ క్రష్ ఏర్పడి ఉంటుందని అందుకే తన స్నేహితుడిని చెప్పకుండా అడ్డుకున్నారంటూ భావిస్తున్నారు.
అయినా ఎప్పటికైనా బాలయ్య ఈ ఆశ గురించి ఏదో ఒక సందర్భంలో అభిమానులతో ఆశ గురించి చెబుతారని భావిస్తున్నారు.మొత్తానికి బాలకృష్ణ తన స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేశారు.