నందమూరి హీరోలలో ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కొనసాగుతున్నారు.ఈ ఇద్దరు హీరోలు భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూ విజయాలను సొంతం చేసుకోవడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు.
బాలయ్య నటించిన అఖండ మూవీ వచ్చే గురువారం థియేటర్లలో రిలీజ్ కానుంది.అఖండ మూవీ టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలను పెంచగా మాస్ జాతర పేరుతో తాజాగా అఖండ నుంచి రిలీజైన మరో వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ మధ్య కాలంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా తాజాగా జరిగిన అఖండ ఈవెంట్ లో బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పడంతో నందమూరి అభిమానులు సంతోషిస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ ను బాలయ్య గతంలో చేరదీసిన సందర్భాలు చాలానే ఉన్నా ఈ మధ్య కాలంలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించలేదు.
త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమాలు అంటూ ఆర్ఆర్ఆర్ గురించి చెబుతూ బాలయ్య చరణ్ గురించి జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు.
బాలయ్య నోటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పేరు రాగానే శిల్పకళా వేదిక ఫ్యాన్స్ కేకలు, అరుపులతో దద్దరిల్లడం గమనార్హం.తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టాలీవుడ్ కు సహకరించాలంటూ బాలకృష్ణ కామెంట్లు చేశారు.బాలయ్య, ఎన్టీఆర్ కాంబో మూవీ కోసం బాలయ్య ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భవిష్యత్తులో ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదనే చెప్పాలి.నందమూరి హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది.కళ్యాణ్ రామ్ బింబిసార అనే సినిమాలో నటిస్తుండగా రేపు ఆ సినిమా నుంచి టీజర్ రిలీజ్ కానుంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం విదేశాల్లో ఉండగా త్వరలో భారత్ కు రానున్నారు.