కలిసి భోజనం చేస్తున్న ఒకప్పటి కమెడియన్స్.. రేర్ ఫోటో వైరల్!

ఒకప్పటికీ.ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో మార్పులు చాలా వచ్చాయి.

 Star Comedians Lunch At Shooting Spot, Star Comedians, Lunch Shooting Spot, Tol-TeluguStop.com

అప్పట్లో సినిమా షూటింగ్ సెట్స్ ఖాళీ సమయంలో డైరెక్టర్స్ తో సహా నటి నటులు కలిసి సమయాన్ని కాలక్షేపం చేసేవారు.కానీ ఇప్పుడు ఒక షూట్ అయిపోయిన వెంటనే తమ క్యారవాన్ లోకి వెళ్తున్నారు.

ఇక మరికొందరు షూటింగ్ పూర్తయ్యే వరకు ఉండకుండా కేవలం తమ షాట్ అయిపోయిన వెంటనే తమ ఇళ్ళలోకి వెళ్తారు.ఇదిలా ఉంటే తాజాగా ఒకప్పటి కమెడియన్స్ కలిసి భోజనం చేస్తున్న ఫోటో వైరల్ గా మారింది.

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన సినిమా ఆహ్వానం.ఈ సినిమాలో శ్రీకాంత్ హీరో గా నటించాడు.ఈ సినిమాలో పలువురు స్టార్ కమెడియన్స్ కూడా నటించారు.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో మండువా లోగిలి సెట్ లో జరుగుతున్న సమయంలో లంచ్ బ్రేక్ ఇవ్వడం తో వాళ్ళ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్ని షేర్ చేసుకుంటూ తింటున్నారు ఆర్టిస్టులందరూ.

ఎవరి గెటప్ లో వాళ్ళు ఉండగా అందులో కోట శ్రీనివాసరావు, ఏవీఎస్, తనికెళ్ల భరణి, గుండు హనుమంతరావు కలిసి ఒకే దగ్గర భోజనం చేస్తున్న సమయంలో షూట్ చేసిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది.అందులో ఆలీ.

కూర్చున్న ఆర్టిస్టులందరికి వడ్డీస్తున్నట్లు కనిపించాడు.ఇక మిగతా వాళ్ళంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ తరంలో నటులు తమ ఇంటి దగ్గర నుండి భోజనాన్ని తెప్పించుకొని తమ క్యారవాన్ లో ఒంటరిగా కూర్చొని తింటుంటారు కానీ.

కలిసి కూర్చొని తినడంలో ఎంతైనా ఆ తృప్తి వేరు ఉంటుందని.ఆ ఫోటో చుస్తే తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube