ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు దగ్గరపడుతుంటే చాలు అన్ని రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలను అమలు చేస్తూ ఉంటారు.రాజకీయ పార్టీల ఎత్తులు పై ఎత్తులు, ప్రచారాలు,ఆకర్షణలు ఇలా పలు అంశాలతో అందరినీ ఆకట్టుకోవాలని చూస్తూ ఉంటారు.
మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో తారల మద్దతు మరింత ముఖ్యం రాజకీయపార్టీ లకు.అందుకే వారిని ఆకర్షించే పనిలో పడతారు రాజకీయ ప్రముఖులు.అయితే ఈ సొద అంతా దేనికి అని అనుకుంటున్నారా.త్వరలో తమిళనాట ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.అక్కడ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండం తో రాజకీయ పార్టీ లు రంగంలోకి దిగుతున్నాయి.ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీ లతో సమానంగా తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలని బీజేపీ పార్టీ కూడా యోచనలో ఉంది.
ఈ క్రమంలోనే అక్కడి తారలకు గెలాలు కూడా వేస్తుంది.
ఈ నేపథ్యంలో ఇటీవల ఛానళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న నటి ఖుష్బూ ను బీజేపీ లోకి ఆహ్వానించగా, ఇప్పుడు తాజాగా ప్రముఖ తమిళ కమెడియన్ వడివేలు కూడా బీజేపీ లో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు డీ ఎంకే పార్టీ తో సంబంధాలు నెరిపిన వడివేలు ప్రస్తుతం ఏ పార్టీ కి కూడా మద్దతు ఇవ్వడం లేదు.ఈ నేపథ్యంలోనే ఆయనకు కాషాయ కండువా కప్పాలని బీజేపీ భావిస్తుంది.
అందుకే ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కొందరు వడివేలుతో సంప్రదింపులు జరిపారని, త్వరలోనే ఆయన కాషాయ కండువాను కప్పుకుంటారన్న వార్త తమిళనాడులో ప్రచారం జరుగుతుంది.
అయితే రాజకీయాలు వడివేలుకు కొత్తేం కాదు అన్న విషయం తెలిసిందే.2011లోనే ఆయన డీఎంకే పార్టీ తరఫున ఆయన ప్రచారం చేసి పరోక్షంగా రాజకీయాల్లో పాల్గొన్నారు.అయితే ఆ సంవత్సరం డీఎంకే ఓడిపోవడంతో అప్పటి నుంచి కూడా ఆయన రాజకీయాలకు ఒకడుగు దూరంగానే ఉంటూ వస్తున్నారు.
అలాంటి ఆయనను ఇప్పుడు బీజేపీ తమ పార్టీ లోకి ఆహ్వానించాలని చూస్తుంది.మరి దీనికి వడివేలు ఎలా స్పందిస్తారో చూడాలి.