బుల్లితెరపై ఒకే సీరియల్ లో, షోలలో నటించిన సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి.యూట్యూబ్ జోడీగా బోలెడంత పాపులారిటీని సొంతం చేసుకున్న రష్మీ గౌతమ్ జోడీ కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని సుధీర్ ఫ్యాన్స్ తో పాటు రష్మీ గౌతమ్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.
గతంలో ఒక ఈవెంట్ లో సుధీర్ రష్మీకి పెళ్లి కూడా జరిపించారనే సంగతి తెలిసిందే.ఈ యూట్యూబ్ జోడీ చేసే షోలకు మంచి టీఆర్పీ రేటింగ్ లు కూడా వస్తున్నాయి.
అయితే ఈ జోడీ పెళ్లికి ఎప్పుడు చేసుకుంటారని అభిమానుల నుంచి చాలా సందర్భాల్లో సుధీర్, రష్మీకి వేర్వేరుగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.అయితే తాజాగా సుధీర్ తో పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురు కాగా రష్మీ ప్రస్తుతం కెరీర్ విషయంపై తప్ప మరో విషయంపై దృష్టి పెట్టలేదని అన్నారు.
ప్రస్తుతం పెళ్లికి సంబంధించి తాను ఎటువంటి నిర్ణయం తీసుకోలేనని రష్మీ గౌతమ్ చెప్పుకొచ్చారు.
2020 సంవత్సరంలో చాలా విషయాలను తాను ప్లాన్ చేసుకుకున్నానని అయితే కరోనా విజృంభణ, లాక్ డౌన్ రూల్స్ వల్ల తన ప్రణాళికలు అన్నీ తారుమారయ్యాయని రష్మీ గౌతమ్ పరోక్షంగా చెప్పారు.ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల పెళ్లి గురించి ఆలోచన చేయాలని అనుకోవడం లేదని రష్మీ స్పష్టతనిచ్చారు.మరోవైపు రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం థియేటర్లు మూతబడిన నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.నందు ఈ సినిమాలో హీరోగా నటించగా రష్మీ పల్లెటూరి యువతిగా నటించారు.
నందు, రష్మీ ఈ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.రష్మీ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తానని భావిస్తున్నారు.