టాలీవుడ్ స్టార్ హీరోలలో, బుల్లితెర సెలబ్రిటీలలో చాలామంది కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నా ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో తమ వంతు సహాయం చేయడానికి ముందుకు రారు.కనీసం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించడానికి ప్రయత్నాలు చేయరు.
అయితే యాంకర్ రష్మీ మాత్రం మిగతా సెలబ్రిటీలకు భిన్నమనే సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ సమాజానికి ఉపయోగపడే పోస్టులు పెట్టడంతో పాటు మూగజీవాలపై జాలి, దయతో వ్యవహరిస్తున్నారు.
మహిళలు, చిన్నపిల్లలు అన్యాయానికి గురైతే ఆ అన్యాయాల గురించి కూడా రష్మీ స్పందిస్తుంటారు.తాజాగా ఒక వీడియో గురించి యాంకర్ రష్మీ రియాక్ట్ కాగా ఆ వీడియోను పసికందును చెత్తకుప్పలో పడేశారు.
అయితే ఈ ఘటన విషయంలో రష్మీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
మన సమాజంలో దురదృష్టం కొద్దీ ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయని రష్మీ చెప్పుకొచ్చారు.అయితే రష్మీ రియాక్ట్ అయిన వీడియోకు సంబంధించిన ఘటన ఎప్పుడు జరిగింది.? ఎక్కడ జరిగింది.? అనే విషయం తెలియాల్సి ఉంది.మరి కొందరు నెటిజన్లు ఆ పసిపాప వివరాలను చెబితే తాము దత్తత తీసుకుంటామని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు.
ఇలాంటి ఘటనలపై రియాక్ట్ అవుతున్న రష్మీ గొప్ప మనస్సును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
రష్మీ సామాజిక అంశాల గురించి స్పందిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇతర యాంకర్లకు భిన్నంగా రష్మీ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.మరోవైపు ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు ప్రస్తుతం రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
మరికొన్ని కొత్త షోలకు కూడా రష్మీ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని తెలుస్తోంది.త్వరలోనే రష్మీ హోస్ట్ చేసే కొత్త షోలకు సంబంధించిన ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.