అది మిస్ అవుతున్నానంటూ ఏడ్చేసిన అనసూయ.. ఏమైందంటే..?

బుల్లితెర యాంకర్లలో ఒకరైన అనసూయ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారనే సంగతి మనందరికీ తెలిసిందే.అనసూయ షోలు, ఈవెంట్లలో పాల్గొంటే ఆ షోలు, ఈవెంట్లకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా ఆమె షేర్ చేస్తూ ఉంటారు.

 Star Anchor Anasuya Comments About Pandemic Situation, Anchor Anasuya, Anasuya A-TeluguStop.com

అనసూయ పెట్టిన ఫోటోలను నెటిజన్లు కొన్నిసార్లు ట్రోల్ చేసినా అనసూయ కూడా కొన్నిసార్లు ధీటుగా కౌంటర్లు ఇచ్చారు.

థ్యాంక్యూ బ్రదర్ సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతుండటం వల్ల షూటింగ్ లు ఆగిపోవడంతో అనసూయ ఇంటికే పరిమితమయ్యారు.తాజాగా ఫేస్ బుక్ ఫాలోవర్లతో ముచ్చటించిన అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఫేస్ బుక్ లో ఒక నెటిజన్ అనసూయను ఆన్ లైన్ లో షాపింగ్ చేయడం ఇష్టమా.? ఇన్ పర్సన్ షాపింగ్ ఇష్టమా.? అని ప్రశ్నించారు.అయితే ఆ ప్రశ్నకు అనసూయ స్పందిస్తూ తనకు ఇన్ పర్సన్ షాపింగ్ అంటే ఇష్టమని ఆన్ లైన్ షాపింగ్ అంటే అస్సలు నచ్చదని పేర్కొన్నారు.

లాక్ డౌన్ నిబంధనలు అమలు కావడంతో ఇన్ పర్సన్ షాపింగ్ ను తాను చాలా మిస్ అవుతున్నానని అనసూయ పేర్కొన్నారు.
అనసూయ ఏడుస్తూ అలా చెప్పడంతో నెటిజన్లు అవాక్కయ్యారు.

మరోవైపు యాంకర్ అనసూయ చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.పుష్ప సినిమాతో మరికొన్ని భారీ ప్రాజెక్టులలో అనసూయ నటిస్తున్నారు.

అనసూయ సోలోగా నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోవడంతో గుర్తింపు తెచ్చిపెట్టే సినిమాలకే ఆమె ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తున్నట్టు తెలుస్తోంది.మరోవైపు అనసూయ కొత్త కథలు వింటున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube