బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో స్టేటస్ తో పాటు వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న నటులలో సల్మాన్ ఖాన్ కూడా ఒకరు.సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్నాయి.
సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ జంటగా నటించిన సినిమాలలో మై నే ప్యార్ కియా సినిమా కూడా ఒకటి.తాజాగా భాగ్య శ్రీ ఒక పాపులర్ షోకు గెస్ట్ గా హాజరయ్యారు.
ఆ షోలో భాగ్యశ్రీ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
మై నే ప్యార్ కియా మూవీ షూటింగ్ సమయంలో తాను కొంత ఇబ్బంది పడ్డానని ఆ తర్వాత సెట్ లో ఉన్నవాళ్లంతా తనకు బాగా పరిచయమయ్యారని ఆమె వెల్లడించారు.
మై నే ప్యార్ కియా మూవీ షూటింగ్ ను తాను బాగా ఎంజాయ్ చేశానని ఆమె తెలిపారు.మై నే ప్యార్ కియా షూటింగ్ సమయానికి తన వయస్సు 18 సంవత్సరాలు అని అప్పటికే తాను వేరే వ్యక్తితో లవ్ లో ఉండటంతో సినిమాలో సల్మాన్ ఖాన్ ను కౌగిలించుకోవడానికి కంగారు పడ్డానని భాగ్యశ్రీ వెల్లడించారు.
తాను సల్మాన్ ఖాన్ ను కౌగిలించుకునే సీన్ చేయనని చెప్పాలని అనుకున్నానని అయితే సల్మాన్ ఖాన్ తన దగ్గరకు వచ్చి సినిమా కోసం ఆ సీన్ చేయాలని రిక్వెస్ట్ చేశారని భాగ్యశ్రీ తెలిపారు.మరో సీన్ లో సల్మాన్ తాను ముద్దు పెట్టుకోవాలని దర్శకుడు అద్దం అడ్డుపెట్టి ఆ సీన్ పూర్తి చేయడంతో ఊపిరి పీల్చుకున్నానని ఆమె అన్నారు.నటి భాగ్యశ్రీ ప్రస్తుతం వరుస మూవీ ఆఫర్లతో బిజీగా ఉన్నారు.
ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలో భాగ్యశ్రీ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాతో పాటు జయలలిత బయోపిక్ గా తెరకెక్కుతున్న తలైవి సినిమాలో కూడా భాగ్యశ్రీ నటిస్తుండటం గమనార్హం.
తాజా వార్తలు