కోట శ్రీనివాసరావు తెలుగులో అన్ని రకాల పాత్రలను పోషించి ఆ పాత్రల ద్వారా మెప్పించడంతో పాటు మరపురాని విజయాలను ఖాతాలో వేసుకున్నారు.కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 25 సంవత్సరాల నుంచి తన లక్ష్యం ఒకటేనని తెలుగులో సినిమాలను తెరకెక్కించే నటులను, నిర్మాతలను ప్రోత్సహించడమే తన లక్ష్యమని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.
అయితే తనకు పరభాషా నటులంటే పడదని మాత్రం అనుకోవద్దని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.
అమితాబ్ బచ్చన్, నానా పటేకర్, నసీరుద్దీన్ షా వంటి నటులను ఎంపిక చేసుకోవడంలో తప్పు లేదని బచ్చాగాళ్లను తీసుకురావడం ఎందుకని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.
తాను కూడా ఇతర భాషల సినిమాల్లో నటించానని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు.నటనలో ఓనమాలు కూడా తెలియని వాళ్లకు లక్షల రూపాయలు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.
తాను సినిమా ఆఫర్లు లేక ఖాళీగా కూర్చున్న రోజులు లేవని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.
కృష్ణవంశీ ఒక సందర్భంలో ప్రకాష్ రాజ్ కు విలన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ కేటగిరీలలో రెండు అవార్డులు రావడంతో తెలుగులో మంచి నటులు లేరని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పగా తెలుగు డైరెక్టర్ అయిన కృష్ణవంశీ అలా మాట్లాడటం తప్పని తాను అన్నానని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.
ఆ సమయంలో కృష్ణవంశీ తనకు ఏం పనిలేదని షూటింగ్ కు తాను తాగి వస్తానని అమ్మాయిలతో దెబ్బలు తిన్నానని అమ్మాయిలతో తిరుగుతానని అన్నాడని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.కృష్ణవంశీ చేసిన కామెంట్లు నిజమే అయితే రాఖీ, గోవిందుడు అందరి వాడేలే సినిమాలలో తనకు ఎందుకు అవకాశం ఇచ్చారని కోట శ్రీనివాసరావు ప్రశ్నించారు.సినిమా రంగంలో మాటామాటా అనుకున్నా గట్టిగా పోట్లాడుకున్నా అది శాశ్వతం కాదని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.