వాషింగ్టన్ లోని లాస్ఏంజెల్స్ లో ఉపాధ్యాయ సంఘాలు గత కొన్ని రోజులుగా నిరవధికంగా సమ్మెని చేపట్టాయి.ఆరు శాతం వేతనాలు పెంచాలని , పరిమితమైన విధ్యార్ధులతో చిన్న తరగతి గదులు , చిన్నారుల రక్షణ కోసం ఆయాలని , నర్సులని ఏర్పాటు చేయాలనే డిమాండ్స్ తో మొదలెట్టిన ఈ సమ్మె 9 రోజులుగా కొనసాగింది.
అయితే ఈ సమ్మె ముగియడంతో దాదాపు 1240 పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యాయి.
అయితే వారి డిమాండ్స్ సాధన కోసం దాదాపు లాస్ఏంజెలెస్ జిల్లాలో పనిచేస్తున్న 34వేల మంది టీచర్స్ తమ విధులని బహిష్కరించి మరీ సమ్మె లో పాల్గొన్నారు.ఈ ప్రభావంతో ఆరు లక్షల మంది చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇదిలాఉంటే ఈ టీచర్ల సమ్మెకు యూనియన్ ప్రెసిడెంట్ అలెక్స్ కాప్యూటో పెరల్ నేతృత్వం వహించారు.
ఈ సమ్మె విరమణ సందర్భంగా ఆయన మాట్లాడాడుతూ తాము తెలిపిన డిమాండ్లకి స్కూల్ యాజమాన్యాలు అంగీకరించడంతో సమ్మె విరమించామని తెలిపారు.టీచర్స్ ఈ ప్రకటనతో స్కూలు యాజమాన్యాలు ఊపిరి పీల్చుకున్నాయి.