సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.ఎన్ని సినిమాలు చేస్తున్న మహేష్ కొత్త సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈయన సినిమా వచ్చి చాలా నెలలు అవుతున్న కూడా ఇంకా మరో సినిమా షూట్ సగం కూడా పూర్తి చేయలేదు.
ప్రెజెంట్ మహేష్, త్రివిక్రమ్ కాంబోలో SSMB28 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో సారధి స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతుంది.
ముచ్చటగా మూడవసారి ఈ కాంబో రిపీట్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఫ్యాన్స్ ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ప్రెజెంట్ అయితే ఫుల్ స్వింగ్ లో యాక్షన్ సన్నివేశాలను త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు అని తెలుస్తుంది.ఇక ఈ సినిమా గురించి ఇప్పుడు మరొక అప్డేట్ బయటకు వచ్చింది.గత రెండు రోజుల నుండి ఈ సినిమా ఓటిటి డీల్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
ఈ సినిమాకు భారీ ఓటిటి డీల్ కుదిరినట్టు.దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ నుండి భారీ డీల్ క్లోజ్ అయినట్టు టాక్ వచ్చింది.
మరి ఈ వార్తలపై ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చింది.ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ నుండి అన్ని భాషల్లో 80 కోట్ల ఆఫర్ వచ్చినట్టు టాక్ రాగా ఇది నిజమే అని మేకర్స్ నెట్ ఫ్లిక్స్ తో 81 కోట్లతో డీల్ క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది.అంతేకాదు ఈ సినిమా రిలీజ్ అయిన 50 రోజుల తర్వాతే అందుబాటులోకి వస్తుందని మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.మొత్తానికి మహేష్ బాబు సినిమా విషయంలో వస్తున్న ఈ రూమర్స్ నిజమే అని తెలుస్తుంది.