నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ‘ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఈ మధ్యనే షూటింగ్ కూడా ముగించేసుకుంది.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా పోస్టర్స్, టీజర్, పాటలు అన్ని కూడా ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి.ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుని విడుదలకు అంత సిద్ధం చేసుకుంటుంది.
సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది.ఇక ఈ సినిమాను వచ్చే నెల డిసెంబర్ 2న విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు.ఒక మరొక వైపు ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ను థమన్ ట్వీట్ ద్వారా తెలిపాడు.
ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న థమన్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఎంత వరకు వచ్చాయో తెలిపాడు.బోయపాటి శ్రీను తో కలిసి దిగిన ఫోటోను థమన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసాడు.ఈ సినిమా చివరి దశ డాల్బీ అండ్ డాల్బీ అట్మాస్ మిక్సింగ్ శరవేగంగా పూర్తి అవుతుందని ఆయన తెలిపాడు.ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్య జైశ్వాల్ నటిస్తుండగా శ్రీకాంత్, జగపతి బాబు, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.సింహ, లెజెండ్ తర్వాత బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అందరు భారీ అంచనాలు పెట్టుకున్నారు.