ప్రెసెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు మొత్తం ఎదురు చూస్తున్న సినిమాల్లో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే ఆర్ఆర్ఆర్ ఒకటి.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయడానికి భారీ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా సంక్రాంతి రేస్ లోకి రావడంతో ఈసారి సంక్రాంతి రేస్ రసవత్తరంగా మారబోతుంది.ఆర్ ఆర్ ఆర్ సినిమా కంటే ముందుగానే స్టార్ హీరోలు తమ సినిమాలను సంక్రాంతి రేస్ లో దింపారు.
ముందుగా మహేష్ బాబు సర్కారు వారి పాట ఎప్పుడో ప్రకటించారు.ఇక ఆ తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలు కూడా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు.
ఇక ఆ తర్వాత రాజమౌలి తన సినిమా ఆర్ ఆర్ ఆర్ ను కూడా సంక్రాంతికే విడుదల చేస్తున్నట్టు ప్రకటించడంతో ఇంకా రసవత్తరంగా మారిపోయింది.ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాను బరిలోకి దింపడంతో స్టార్ హీరోలు డైలమాలో పడ్డారు.
ఇక రాజమౌళి రిక్వస్ట్ చేయడంతో మహేష్ బాబు తన సినిమాను వాయిదా వేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు.ఇంకా ప్రభాస్ ను కూడా సినిమా వాయిదా వేసుకోమని అడిగినట్టు తెలుస్తుంది.
అయితే ప్రభాస్ రాధేశ్యామ్ ఇప్పటికే రెండు సంవత్సరాల నుండి తెరకెక్కుతూనే ఉంది.ఇప్పటికే పలుసార్లు వాయిదా కూడా వేశారు.ఇక అందుకే ఈ సినిమాను వాయిదా వేసుకునే ఆలోచనలో లేనట్టు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది.ఇక మిగిలింది పవన్ భీమ్లా నాయక్ సినిమా మాత్రమే.ఈ సినిమా కూడా వెనక్కి తగ్గినట్టు వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే రాలేదు.
అయితే నిర్మాతలు మాత్రం వెనక్కి తగ్గకుండా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.దీంతో ఇప్పుడు ఈ సినిమాను వాయిదా వేసుకోమని చెప్పడానికి రాజమౌళి నే రంగం లోకి దిగుతున్నట్టు తెలుస్తుంది.భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ గురించి మాట్లాడానికి పవన్ కళ్యాణ్ ను రాజమౌళి కలవనున్నాడని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరి చూడాలి రాజమౌళి రంగంలోకి దిగి పవన్ ను ఒప్పిస్తాడా.లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.