ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతుంది ఎవరు అంటే అందరు టక్కున చెప్పేస్తారు పూజా హెగ్డే అని.ఎందుకంటే యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరి సినిమాల్లో నటిస్తూ వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ అమ్మడు.
ఇక ప్రస్తుతం స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే ఆ సినిమాలో హీరోయిన్ గా దర్శక నిర్మాతలకు మొదటి ఆప్షన్ పూజా హెగ్డే అని చెప్పాలి.అంతలా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది ఈ బ్యూటీ.
ఇక ఇప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా కొనసాగుతోంది.అయితే పూజా హెగ్డే ఇంతటి స్టార్ హీరోయిన్ కావడానికి శృతి హాసన్ కారణమంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది.
అదేంటి పూజాహెగ్డే స్టార్ హీరోయిన్ కావడానికి శృతిహాసన్ ఎలా కారణం అవుతుంది అని ఆశ్చర్య పోతున్నారు కదా.పూజా హెగ్డే కెరియర్ లో టర్నింగ్ పాయింట్ సినిమా అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన దువ్వాడ జగన్నాథం.హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2017 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మంచి విజయాన్ని కూడా అందుకుంది.
అప్పటివరకు ఓ మోస్తరు విజయాలను అందుకున్న పూజాకు సాలిడ్ హిట్ అందించి కెరీర్ను మలుపు తిప్పింది దువ్వాడ జగన్నాథం.ఈ సినిమా చేసిన తర్వాత పూజా హెగ్డే కి వరుస అవకాశాలు వచ్చి ముంగిట వాలిపోయాయి.అయితే ముందుగా ఈ సినిమాలో పూజా హెగ్డేను తీసుకోవాలని అనుకోలేదట.అల్లు అర్జున్ కు జోడీగా శృతిహాసన్ బాగా సెట్ అవుతుందని అనుకున్నారట.
కానీ కొన్ని కారణాలవల్ల శృతిహాసన్ ఇక ఈ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేక పోయిందట.దీంతో ఇక ఈ ఆఫర్ కాస్త పూజా హెగ్డే వరకు వచ్చింది.ఒకవేళ అప్పుడు శృతిహాసన్ ఈ సినిమా చేసి ఉంటే శృతిహాసన్ ఖాతాలో మరో హిట్ పడేది.ఇక పూజా హెగ్డే కెరియర్ పాతాళానికి పడిపోయేది అని తెలుస్తోంది.
ఇలా పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ కావటానికి కారణం శృతిహాసన్ అన్నది తెలుస్తుంది.