రోడ్డు ప్రయాణాలు రోజు రోజుకు ప్రమాదంగా మారుతున్నాయి.మూడు రోజుల క్రితం వరంగల్ జిల్లాలో కెనాల్ కారు ప్రమాదం ఘటన మరువక ముందే మరో కారు కెనాల్లో దూసుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది.ఆ వివరాలు చూస్తే.
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట వద్ద కారు ఎస్సారెస్పీ కెనాల్ లోకి దూసుకెళ్లడంతో ముగ్గురు గల్లంతయ్యారు.
ఒకరు సురక్షితంగా బయటపడ్డారు.ఇక గల్లంతైన వారు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.
ఇకపోతే ఈ ప్రమాద ఘటనలో మరణించిన వారిలో కోరుట్ల మండలం జొగినిపల్లికి చెందిన న్యాయవాది అమరేందర్ రావు, అమరేందర్ రావు భార్య శిరీషా, కూతురు శ్రేయా, కాగా అమరేందర్ రావు కుమారుడు జయంత్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.
అయితే ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ జయంత్ బయటికి వచ్చి చెప్పే వరకు కారు కెనాల్ లో పడ్డ విషయం ఎవరికీ తెలియదు.ఇకపోతే ఈ మధ్యకాలంలో కెనాల్లు కూదా చాలా ప్రమాదకరంగా మారి ప్రాణాలను హరిస్తున్నాయి.ఈ విషయంలో అధికారులు ఏదో ఒకటి చేయకుంటే మాత్రం మరెన్ని ప్రాణాలు గాల్లో కలవవలసి వస్తుందో.