కృష్ణా నది ఎగువన భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీశైలం డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరింది.దాంతో డ్యాం గేట్లు ఎత్తి నీటిని వదలాల్సి వచ్చింది.
అయితే మామూలుగా అయితే గేట్లు ఎత్తేందుకు మంత్రులు లేదా ప్రభుత్వ ప్రతినిధులు లేదంటే డ్యాంపై ఉండే చీప్ ఇంజనీర్స్ ఓపెన్ చేస్తారు.కాని తాజాగా శ్రీశైలం డ్యాం గేట్లను ఏపీ జల వనరుల శాఖ ఇన్ చార్జ్ సూపరెండెంట్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి తన భార్యతో గేట్లు ఎత్తించడం జరిగింది.
పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత శ్రీనివాసరెడ్డి భార్య స్విచ్చాన్ చేసి గేట్లను ఎత్తడం చేశారు.అయితే ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఒక అధికారి తన భార్యతో గేట్లు ఎత్తించడం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.రేపొద్దున సమీక్ష సమావేశంలో కూడా భార్యను కూర్చోబెడతాడా అంటూ ప్రశ్నిస్తున్నారు.
అసలు అధికారి ఇలా చేయడంను ఎవరి మద్దతుతో అంటూ ఆగ్రహంతో ఉన్నారు.శ్రీనివాసరెడ్డి ఇష్యూపై ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారు.
మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.