వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో స్టార్ స్టేటస్ ఉన్న సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నారు.తాజాగా ఈ నటి కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న అల్లు అర్జున్ ను టార్గెట్ చేయడం గమనార్హం.
కొన్నిరోజుల క్రితం అల్లు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి పోస్టులు పెట్టారు.తాజాగా శ్రీరెడ్డి పోస్టులో మహేష్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ రారండోయ్ అన్నానో లేదో మన పుష్పానికి కరోనా వచ్చేసిందని పేర్కొన్నారు.
పోస్ట్ చివర్లో రండ్రా మీమ్స్ వేసుకుందాం అంటూ శ్రీరెడ్డి రెచ్చిపోయి పోస్ట్ పెట్టగా శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ విషయంలో ఫ్యాన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అల్లు అర్జున్ ఫ్యాన్స్ శ్రీరెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.
ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ మాత్రం మమ్మల్ని అనవసర వివాదాల్లోకి లాగవద్దంటూ శ్రీరెడ్డిని ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు.శ్రీరెడ్డి పోస్ట్ తో పాటు పుష్ప మూవీలోని పోస్టర్ ను షేర్ చేయడం గమనార్హం.
కొన్నిరోజుల క్రితం వరకు మెగా ఫ్యామిలీని ఎక్కువగా టార్గెట్ చేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం బన్నీని టార్గెట్ చేయడం గమనార్హం.పవన్ కళ్యాణ్ కు కరోనా సోకిన సమయంలో సైతం శ్రీరెడ్డి వివాదాస్పద పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.
మరి కొందరు మాత్రం శ్రీరెడ్డి ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుందో అస్సలు అర్థం కాదంటూ సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.అయితే శ్రీరెడ్డి పాపులారిటీ కొరకే ఇలా కామెంట్లు చేస్తున్నారంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
రెండు రోజుల క్రితం బన్నీకి కరోనా నిర్ధారణ కాగా బన్నీ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.పుష్ప సినిమా అడవికి సంబంధించిన సీన్ల చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కాగా మిగిలిన సన్నివేశాల షూటింగ్ జరగాల్సి ఉంది.సుకుమార్ ఆగష్టు 13వ తేదీనే పుష్ప మూవీని రిలీజ్ చేయాలని భావిస్తుండగా సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.