టాలీవుడ్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది శ్రీరెడ్డి.కొన్ని నెలల క్రితం చెన్నైకు వెళ్లిన శ్రీరెడ్డి కొంతకాలం పాటు సైలెంట్ అయ్యారు.
అయితే మళ్లీ గత కొన్ని రోజుల నుంచి సమంత, రకుల్ ప్రీత్ సింగ్, పవన్ కళ్యాణ్, మరికొంత మంది సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు.అయితే శ్రీరెడ్డి నిహారిక పెళ్లి గురించి కూడా కామెంట్లు చేసి మరోమారు వార్తల్లో నిలిచారు.
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ లో నిహారిక పెళ్లి, నిన్న జేఆర్సీ కన్వెన్షన్ లో రిసెప్షన్ గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో నిహారిక పెళ్లికి సంబంధించిన వార్తలు, పెళ్లికి హాజరైన సెలబ్రిటీల వివరాలు, పెళ్లి కానుకల గురించి జోరుగా ప్రచారం జరిగింది.
మొదటి నుంచి మెగా ఫ్యామిలీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న శ్రీరెడ్డి నాగబాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లపై కూడా గతంలో విమర్శలు చేసింది.
తాజాగా ట్విట్టర్ వీడియోలో ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి లాగా మీరెందుకు హడావిడి చేస్తున్నారని.పవన్ కళ్యాణ్ వచ్చాడని ఇంకెవవరో వచ్చారని డ్యాన్సులు చేశారని వీడియోలు పెడుతున్నారని.అవి కాకుండా పనికొచ్చే పనులు చేయాలంటూ కామెంట్లు చేశారు.
ఢిల్లీలో రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తుంటే అలాంటి వాటికి మాత్రం ఎవరూ మద్దతు పలకడం లేదని శ్రీరెడ్డి అన్నారు.
మీడియా కూడా నిహారిక పెళ్లి గురించి అంతగా హైలెట్ చేయాల్సిన అవసరం లేదని.
రైతుల సమస్యల గురించి, తమిళనాడులో ఒక నటి ఆత్మహత్య చేసుకుందని అలాంటి వాటిని హైలెట్ చేయాలని సూచించారు.పనికిమాలిన వెధవల్లారా తాను మీడియాను అనడం లేదని.
పెళ్లిళ్లను చూసి పిసికేసుకుంటున్న వాళ్లను అంటున్నానని శ్రీరెడ్డి చెప్పారు.