నటించింది తక్కువ సినిమాలే అయినా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా గత కొన్ని నెలల నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు శ్రీరెడ్డి.తాజాగా శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ గురించి సెటైరికల్ ట్వీట్ చేయగా ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఛలో దర్శకుడు వెంకీ కుడుముల రెండు రోజుల క్రితం సైబర్ మోసం బారిన పడ్డానని వెల్లడించిన సంగతి తెలిసిందే.భీష్మ మూవీలో ఆర్గానిక్ ఫామింగ్ గురించి ఉండటంతో వెంకీ కుడుముల జాతీయ అవార్డుకు దరఖాస్తు చేయడం కోసం నవీన్ అనే వ్యక్తి మాటలు నమ్మి 63,600 రూపాయలు డిపాజిట్ చేశాడు.
ఆ తరువాత వెంకీ కుడుముల నుంచి నవీన్ అనే వ్యక్తి మరికొంత డబ్బు తీసుకుందామని ప్రయత్నం చేయగా వెంకీ కుడుములకు అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.ప్రస్తుతం పోలీసులు మోసం చేసిన వ్యక్తిని కనిపెట్టే పనిలో ఉన్నారు.
అయితే వెంకీ కుడుముల గత సినిమా భీష్మ సినిమాలో హీరో నితిన్ కాగా నితిన్ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అనే సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వకీల్ సాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు.
వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.వెంకీ కుడుముల పేరును ప్రస్తావించకుండా సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోగా నితిన్ భలే మోసపోయాడంటూ శ్రీరెడ్డి పరోక్షంగా సెటైర్లు వేశారు.
ఇలాంటి బుర్ర తక్కువ వాళ్లు అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లే అని అన్నారు.
కొంచెం బుర్ర వాడాలని చెప్పడంతో పాటు వకీల్ సాబ్ గారు ఈ కేసు కూడా కొంచెం వాదించాలంటూ ట్వీట్ చేశారు.శ్రీరెడ్డి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.దర్శకుని పేరును ప్రస్తావించకుండా శ్రీరెడ్డి హీరో పేరును ప్రస్తావించడంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.