టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు, కామెంట్లు చేసి వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఎప్పుడూ పాజిటివ్ గా స్పందిస్తారనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మరోవైపు ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమో విడుదల కావడంతో పాటు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
త్వరలో ఈ రియాలిటీ షో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
నిన్న ప్రోమో రిలీజ్ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఎన్టీఆర్ రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని తరువాత ఎప్పుడైనా తీరికగా కూర్చుని మాట్లాడదాం అని తెలిపారు.తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలని కోరుతున్న తరుణంలో రాజకీయాల గురించి ఎన్టీఆర్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.
అయితే శ్రీరెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో జూనియర్ ఎన్టీఆర్ గారు పాలిటిక్స్ లోకి వస్తారో రారో తనకు తెలియదని.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం ముఖ్యమంత్రి కావడం పక్కా అని శ్రీరెడ్డి పోస్ట్ చేశారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు జూనియర్ ఎన్టీఆర్ ను సొంత కొడుకులా, అన్నలా చూసుకుంటారని శ్రీరెడ్డి పేర్కొన్నారు.ఎన్టీఆర్ సీఎం కావడం పక్కా అంటూ శ్రీరెడ్డి చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.
మరోవైపు ఎన్టీఆర్ 2029 వరకు సినిమాలకే పూర్తి సమయం కేటాయిస్తారని 2029 సంవత్సరంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే టీడీపీతోనే ఎంట్రీ ఇస్తారో లేక ఇతర పార్టీతో ఎంట్రీ ఇస్తారో చూడాల్సి ఉంది.