కొన్ని రోజుల క్రితం శ్రీరెడ్డి ఫ్యాన్స్ కు ఒక శుభవార్త చెబుతానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే.శ్రీరెడ్డి శుభవార్త చెబుతానని పెట్టిన పోస్ట్ గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అయితే శ్రీరెడ్డి తాజాగా ఆ శుభవార్త ఏంటో చెప్పేశారు.ఇది తనకు మాత్రమే ఫ్యాన్స్ కు మాత్రమే శుభవార్త కాదని తనకు కూడా శుభవార్తేనని ఆమె తెలిపారు.
గ్లామరస్ యాక్టర్ సిల్క్ స్మిత బయోపిక్ లో నటించబోతున్నానని శ్రీరెడ్డి తెలిపారు.
తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుందని శ్రీరెడ్డి వెల్లడించారు.
మిగిలిన వివరాలను త్వరలో వెల్లడిస్తానని అభిమానుల ఆశీర్వాదాలు తనకు కావాలని శ్రీరెడ్డి అన్నారు.ఈ సినిమాకు మధు అనే వ్యక్తి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే శ్రీరెడ్డి కొన్ని తెలుగు, తమిళ సినిమాల్లో నటించినా ఆ సినిమాలు శ్రీరెడ్డికి నటిగా ఆశించిన స్థాయిలో గుర్తింపును ఇవ్వలేదు.
సిల్క్ స్మిత బయోపిక్ విడుదలైన తరువాత శ్రీరెడ్డి వరుస ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా గతంలో చాలాసార్లు వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి సినిమా ఆఫర్ల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉండటం గమనార్హం.శ్రీరెడ్డి ఒక ఫోటోను కూడా ఫేస్ బుక్ లో షేర్ చేసి సిల్క్ స్మిత లుక్ లో ఎలా ఉండబోతుందో తెలిసేలా చేశారు.
అయితే శ్రీరెడ్డి లుక్ కొందరు బాగుందని చెబుతుంటే మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు.
శ్రీరెడ్డి నటించబోయే సినిమాకు నిర్మాత, సంగీతదర్శకుడు, ఇతర పాత్రలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీరెడ్డి ఇన్ని రోజులకు ఒక భారీ ప్రాజెక్ట్ లో అవకాశం పొందడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.బయోపిక్ లను ప్రేక్షకులు ఆదరిస్తున్న నేపథ్యంలో శ్రీరెడ్డి నటిస్తున్న సిల్క్ స్మిత బయోపిక్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాల్సి ఉంది.