వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఎప్పుడూ ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూనే ఉంటోంది.ఏదో ఒక వివాదంలో ఉండకపోతే ఆమెకు అస్సలు నిద్రపట్టడం లేదనుకుంటా.! తాజాగా శాండల్వుడ్ సినిమ పరిశ్రమను డ్రగ్స్ ఉదంతం కుదిపేస్తోంది.మరోవైపు దివంగత బాలీవుడ్ నటుడు రియా చక్రవర్తిని డ్రగ్స్ కేసులో విచారిస్తోన్న క్రమంలోనే ఆమె టాలీవుడ్ హీరోయిన్ రకుల్ప్రీత్సింగ్, బాలీవుడ్ హీరోయిన్ సారా ఆలీఖాన్ పేర్లు కూడా బయట పెట్టిందన్న వార్తలు వస్తున్నాయి.
ఈ టైంలో శ్రీరెడ్డి రకుల్పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యింది.
శ్రీరెడ్డి ఆమెపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
తాను గతంలో టాలీవుడ్లో కాస్టింగ కౌచ్ ఉందని కామెంట్ చేశానని అప్పుడు రకుల్ అసలు ఇక్కడ అలాంటివేవి లేవని చెప్పిందని శ్రీరెడ్డి తెలిపింది.అసలు టాలీవుడ్లో డ్రగ్స్ కల్చర్ అన్నదే లేదని కూడా రకుల్ మాట్లాడిందని.
పైగా రకుల్ చేసిన క్యాండిల్ ర్యాలీలను కూడా తాను మర్చిపోలేదని శ్రీరెడ్డి చెప్పింది.నాడు పత్తిత్తులా మాట్లాడిన రకుల్ ఇప్పుడు ఆమె పేరు డ్రగ్ కేసులో బయటకు రావడంతో ఏమని చెపుతుందని కూడా ఫైర్ అయ్యింది.
ఇక అప్పట్లోనే మంచు లక్ష్మి సైతం టాలీవుడ్ గురించి తప్పుడు ప్రచారం చేస్తారా ? అని వ్యాఖ్యానించిన విషయం కూడా శ్రీరెడ్డి గుర్తు చేసింది.నాడు తనను విమర్శించిన వారికి ఇప్పుడు తెలిసి వస్తోందని.
కర్మ ఎవ్వరిని వదిలి పెట్టదు అన్న విషయం ఇప్పుడు అందరికి అర్థమవుతోందని శ్రీరెడ్డి సెటైర్ వేసింది.ఇక తనను విమర్శించిన వారిలో కొందరు కరోనా భారీన కూడా పడ్డారని.
కొద్ది రోజుల్లోనే ఒక్కొక్కరి రంకు బాగోతాలు అన్ని బయటకు వస్తాయని చెప్పింది.ఏదేమైనా శ్రీరెడ్డి మరోసారి రంకు బాగోతాల గురించి చెప్పడంతో మళ్లీ ఎవరి పేర్లు బయటకు వస్తాయా ? అన్న టెన్షన్ టాలీవుడ్లో చాలా మందికి ఉంది.