క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీరెడ్డి.ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి తాజాగా బికినీ వేసి మరోసారి వార్తల్లోకెక్కారు.
శ్రీరెడ్డి బికినీ వేయడంలో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా స్టార్ హీరోయిన్లైన సమంత, రకుల్ ప్రీత్ సింగ్ లను టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టంట వైరల్ అవుతున్నాయి.కొన్ని రోజుల క్రితం సమంత మాల్దీవ్స్ లో దిగిన హాట్ ఫోటోలపై శ్రీరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
శ్రీరెడ్డి తన పోస్ట్ లో బికినీ స్ట్రక్చర్ అంటే ఇదీ అని.సమంత వదినా అని అన్నారు.తన బికినీ ఫోటోలను చూసి రకుల్ ప్రీత్ సింగ్ కుళ్లుకుంటుందంటూ కామెంట్లు చేశారు.తాను మేకప్ లేకుండానే ఈ ఫోటోలను షేర్ చేశానని శ్రీరెడ్డి పేర్కొన్నారు.శ్రీరెడ్డి వేల సంఖ్యలో లైకులు, వందల సంఖ్యలో షేర్ లు వస్తున్నాయి.టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు మకాం మార్చిన శ్రీరెడ్డి టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.
ఈ మధ్య కాలంలో రకుల్, సమంత బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో శ్రీరెడ్డి కౌంటర్ ఇస్తూ తన బికినీ ఫోటోలను షేర్ చేస్తున్నారు.అయితే సమంత, రకుల్ అభిమానులు మాత్రం శ్రీరెడ్డి తమ ఫేవరెట్ హీరోయిన్లను కించపరిచే విధంగా పోస్టులు పెట్టడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు.అయితే శ్రీరెడ్డి పోస్టులపై సెలబ్రిటీలు మాత్రం స్పందించడం లేదు.
గతంలో కూడా శ్రీరెడ్డి రకుల్ ప్రీత్ సింగ్ ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.
రకుల్ టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ లేదు లేదంటూ, డ్రగ్స్ లేదంటూ రకుల్ కామెంట్లు చేయగా సుశాంత్ మృతి కేసులో రకుల్ పేరు వినిపించడంతో రకుల్ ప్రీత్ సింగ్ పత్తిత్తు కబుర్లు చెప్పడం మానేయాలంటూ శ్రీరెడ్డి ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.