టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో శ్రీను వైట్ల ఒకరు.ఈయన చాలా సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు.
అయితే గత కొన్నేళ్లుగా ఈయన కెరీర్ డౌన్ అయ్యింది.వరుస సినిమాలు ప్లాప్ అవుతూ వస్తుండడంతో ఏ హీరో అవకాశం ఇవ్వడం లేదు.
ఇక స్టార్ హీరోలు అవకాశం ఇవ్వక పోవడంతో ఈయన ప్రెజెంట్ యంగ్ హీరో మంచు విష్ణు తో సినిమా చేస్తున్నాడు.
శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబోలో వచ్చిన ఢీ సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా డిడి (డబుల్ డోస్) అనే సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసారు.ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాతో తనని తాను నిరూపించు కోవాలని శ్రీను వైట్ల ఆరాట పడుతున్నారు.మరి ఈ సినిమా ఎంత హిట్ అవుతుందో చూడాలి.
ఇది పక్కన పెడితే ఈయన నెక్స్ట్ సినిమాపై లేటెస్ట్ గా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల స్టార్ హీరోను లైన్లో పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మాస్ రాజా రవితేజ ను శ్రీను వైట్ల ఒప్పించినట్టు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే శ్రీను వైట్ల రవితేజకు ఒక కథ కూడా వినిపించారని తెలుస్తుంది.
మాస్ రాజా ఈ కథ నచ్చడంతో శ్రీను వైట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.ఈ ఏడాది చివరిలోనే వీరి కాంబోలో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్.
మరి ఈ కాంబోలో మరో హిట్ సినిమా వస్తుందో లేదో చూడాలి.ప్రెజెంట్ రవితేజ చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి.
ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు సెట్స్ మీద ఉండగా మరికొంత మందిని లైన్లో పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.