కొన్ని కొన్ని సార్లు దర్శకలు ఎంతో మంచి కథతో సినిమాను రూపొందిస్తారు.నిర్మాతలు బడ్జెట్ విషయంలో అసలు తగ్గరు.
సినిమా విడుదలకు ముందే మంచి హిట్ అవుతుందన్న టాక్ కూడా ఉంటుంది.కానీ సినిమా విడుదలయ్యాక అనుకోని పరిస్థితుల్లో ప్లాప్ కూడా అవుతుంది.
కథ ఎంత మంచిగా ఉన్నా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోతుంది.అలా ఇప్పటికీ ఎంతో మంది హీరోలు, దర్శక నిర్మాతలు తమ సినిమాల వల్ల నిరాశపడ్డారు.
ఇదిలా ఉంటే మహేష్ బాబు నటించిన ఆగడు సినిమా కూడా విడుదలకు ముందు ఎంతో అంచనాలు రేకెత్తించింది.కానీ సినిమా విడుదల తర్వాత దర్శకనిర్మాతలకు, నటీనటులకే కాకుండా అభిమానులను కూడా నిరాశ పరిచింది.
కారణం ఎవరికి తెలియక పోగా తాజాగా ఈ సినీ డైరెక్టర్ శ్రీనువైట్ల ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకడిగా నిలిచాడు శ్రీనువైట్ల.
ఈయన 1999 లో ‘నీ కోసం’ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.ఈ సినిమా తర్వాత ‘ఆనందం’ సినిమాకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత సొంతం, వెంకీ, అందరివాడు, ఢీ, దుబాయ్ శీను, కింగ్, దూకుడు, ఆగడు వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.
చాలా వరకు స్టార్ హీరోల సినిమాలకే దర్శకత్వం వహించాడు.ఇక దూకుడు సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా అవార్డు సొంతం చేసుకున్నాడు.అంతేకాకుండా మంచి దర్శకుడిగా కూడా అవార్డు అందుకున్నాడు.
ఇదిలా ఉంటే ఈయన తాజాగా బుల్లితెరపై ఓ రియాలిటీ షోలో పాల్గొన్నాడు.
ఆలీ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ఆలీతో సరదాగా అనే షో కు గెస్ట్ గా వచ్చాడు.
దీంతో తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో కొన్ని విషయాలు పంచుకున్నాడు.లైఫ్ ఎలా ఉందని ఆలీ అడగగా అన్ని విధాలుగా బాగానే ఉందన్నట్లు సమాధానమిచ్చాడు.
తాను ఇంట్లో చెప్పకుండా మద్రాస్ కి వెళ్ళినప్పుడు తన అన్నయ్య వచ్చాడని ఆ సమయంలో ఏమి చేయాలో అర్థం కాలేదని తన గతాన్ని సరదాగా చెప్పుకున్నాడు.ఇక రవితేజతో నీకోసం సినిమా చేసినప్పుడు రామోజీరావు చూసి సినిమా బాగుందని తనకు మరో ఛాన్స్ ఇస్తానని చెప్పి ఆనందం సినిమాలో అవకాశం ఇచ్చాడని చెప్పాడు.
ఇక ఈ సినిమాను మంచిరోజు చూసి మొదలు పెడతామని రామోజీరావు తో అంటే చెడ్డ రోజుల్లో కూడా ప్రారంభించండి.ఎందుకు ఆడదో అని అన్నాడట.అలా తాను తీసిన దూకుడు సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.అలా గతంలో జరిగిన కొన్ని సరదా విషయాలు పంచుకున్నాడు.
దూకుడు సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి అజిత్ తో అవకాశం వచ్చినా కూడా చేయలేకపోయానని ఇప్పటికీ ఆ విషయం బాధ పెడుతుందని తెలిపాడు.ఆగడు సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటని ప్రశ్న ఎదురవడంతో.మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి మాస్ సినిమా తీయండని బాగా గోల వచ్చిందని అన్నాడు.తనకు మాత్రం సెల్ఫీష్ మాత్రంగానే నేర్చుకున్నాను అని అందుకే ఆ సినిమా అభిమానులకు నచ్చకపోవడంతో ఫ్లాప్ అయిందని తెలిపాడు.